వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ వళ్లం నవీన్ ఓల్డ్ బోయిన్పల్లి, న్యూ బోయిన్పల్లి ప్రాంతాల్లోని కొవిడ్ బాధితులకు ఆహారాన్ని అందించారు. ప్రతి రోజు దాదాపు 50 మందికి ఆహార ప్యాకెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గత లాక్డౌన్ కాలంలో వలస కార్మికులు, నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ, మాస్కుల పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు.
ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారి ఇంటికి వెళ్లి ఆహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. కొవిడ్తో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు.
ఇదీ చదవండి: కొనసాగుతున్న లాక్డౌన్.. సడలింపు సమయంలో కిటకిట