ETV Bharat / state

కాచిగూడ రైళ్ల ప్రమాదంపై మొదటి రోజు విచారణ పూర్తి - కాచిగూడ రైళ్ల ప్రమాదంపై విచారణ

విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ నేతృత్వంలో కాచిగూడ రైళ్ల ప్రమాదంపై మొదటి రోజు విచారణ పూర్తయింది. రేపు రెండో రోజు విచారణ జరగనుంది.

కాచిగూడ రైళ్ల ప్రమాదంపై విచారణ
author img

By

Published : Nov 13, 2019, 8:07 PM IST

కాచిగూడ రైళ్ల ప్రమాద ఘటనపై మొదటి రోజు ఉన్నతస్థాయి కమిటీ విచారణ పూర్తయ్యింది. విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ నేతృత్వంలో విచారణ జరిగింది. రాంకృపాల్​తో పాటు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి పాల్గొన్నారు. ఉదయం 10:30కు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగింది.

ఆరు మంది ప్రయాణికులను ప్రమాద సమయంలో వారు చూసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ రైల్వే స్టేషన్​లోకి వెళ్లి ఎంఎంటీఎస్ ఏ ప్లాట్ ఫారం నుంచి బయలుదేరింది... తదితర వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరినప్పుడు సీసీ పుటేజీ ఎక్కడ రికార్డ్ అయిందో తెలుసుకుని.. రైళ్ల ఆపరేషన్స్ వివరాలు కనుక్కున్నారు. అనంతరం ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్​లను పరిశీలించారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని అధికారులు పరామర్శించారు. రేపు రెండవ రోజు విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

కాచిగూడ రైళ్ల ప్రమాదంపై విచారణ

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

కాచిగూడ రైళ్ల ప్రమాద ఘటనపై మొదటి రోజు ఉన్నతస్థాయి కమిటీ విచారణ పూర్తయ్యింది. విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ నేతృత్వంలో విచారణ జరిగింది. రాంకృపాల్​తో పాటు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి పాల్గొన్నారు. ఉదయం 10:30కు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగింది.

ఆరు మంది ప్రయాణికులను ప్రమాద సమయంలో వారు చూసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ రైల్వే స్టేషన్​లోకి వెళ్లి ఎంఎంటీఎస్ ఏ ప్లాట్ ఫారం నుంచి బయలుదేరింది... తదితర వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరినప్పుడు సీసీ పుటేజీ ఎక్కడ రికార్డ్ అయిందో తెలుసుకుని.. రైళ్ల ఆపరేషన్స్ వివరాలు కనుక్కున్నారు. అనంతరం ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్​లను పరిశీలించారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని అధికారులు పరామర్శించారు. రేపు రెండవ రోజు విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

కాచిగూడ రైళ్ల ప్రమాదంపై విచారణ

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

Tg_hyd_57_13_railway_enquiry_1stday_ab_3182388 reporter : sripathi.srinivas Note: TG_HYD_23_13_RAILWAY_ACCIDENT_ENQUIRY_AV_DRY_3182388 ఫైల్ ఫీడ్ వాడుకోగలరు. ( ) కాచిగూడ రైళ్ల ప్రమాద ఘటనపై మొదటి రోజు హైలెవల్ కమిటీ విచారణ పూర్తయ్యింది. విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. ఈ విచారణలో రాంకృపాల్ తో పాటు ఒక డిప్యూటీ కమీషనర్ ఆఫ్ రైల్వే సేప్టీ అధికారి పాల్గొన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంమై మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగింది. ఆరు మంది ప్రయాణికులను ప్రమాద సమయంలో వారు చూసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రైల్వే సేఫ్టీ అధికారి రామ్ కృపాల్ కాచిగూడ రైల్వే స్టేషన్ లోకి వెళ్లి ఎం.ఎం.టీ.ఎస్ ఏ ప్లాట్ ఫారం నుంచి బయలుదేరింది తదితర వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. పట్టాలు మారే ప్రదేశాన్ని సునిశితంగా పరిశీలించారు. ప్రమాదం జరినప్పుడు సీ.సీ పుటేజీ ఎక్కడ రికార్డ్ అయ్యిందో కూడా తెలుసుకున్నారు. రైళ్ల ఆపరేషన్స్ వివరాలు కనుక్కున్నారు. అనంతరం ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్ లను పరిశీలించారు. అక్కడి నుంచి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని సేఫ్టీ అధికారులు పరామర్శించారు. రేపు రెండవ రోజు విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రెండవరోజు విచారణలో రైల్వే ముఖ్య అధికారులను సుదీర్ఘంగా విచారించనున్నారు. బైట్: రవీందర్, విచారణకు హాజరైన ప్రయాణికుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.