బోయిన్పల్లిలోని అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్న పెయింట్ టిన్నర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గోదాం పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిన్న శివరాత్రి అయినందున ఈ రోజు ఎవరూ పనికి రాకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు చెబుతున్నారు. ఘటనకి గల కారణాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి: చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి