హైదరాబాద్ కూకట్పల్లిలో ముడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడర్స్ కాంప్లెక్స్ సెల్లార్లో సోమవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో పార్కింగ్లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు .అయితే అప్పటికే మూడు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక టీవీఎస్ వాహనం పాక్షికంగా కాలిపోయింది.
ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'