ETV Bharat / state

'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'

author img

By

Published : Jan 6, 2020, 6:12 PM IST

Updated : Jan 6, 2020, 11:28 PM IST

పురపాలక ఎన్నికల నోటిఫికేషన్​ను సవాల్ చేస్తూ... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

High court on congress pitition
'విచారణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ జారీ చేయొద్దు'

పురపాలక ఎన్నికలపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు పూర్తై తుది తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్​ను సవాల్ చేస్తూ.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇరువైపులా వాదోపవాదాలు నడిచాయి.

కుల ధ్రువీకరణ పత్రం పొందే సమయం కూడా ఇవ్వలేదు..

ఉత్తమ్ కుమార్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించలేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొదట రిజర్వేషన్లు.. ఆ తర్వాత నోటిఫికేషన్, షెడ్యూల్ ప్రకటించాలని.. కానీ అన్నింటికంటే ముందే షెడ్యూల్ ప్రకటించారని ప్రకాశ్ రెడ్డి వాదించారు. రిజర్వేషన్లు ప్రకటించిన రెండు రోజుల తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని... దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం పొందే సమయం కూడా లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నాం..

న్యాయవాది వాదనతో ఏకీభవించిన ధర్మాసనం... రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది సీపీ మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. బరిలో నిలిచే అభ్యర్థులు తమ కులధ్రువీకరణ పత్రం దాఖలు చేయాల్సిన నిబంధన ఏమీ లేదని... తెలంగాణ పురపాలక చట్టం ప్రకారం అభ్యర్థులు డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందని... హైకోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారమే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నామని సీవీ మోహన్ రెడ్డి న్యాయస్థానానికి వివరించారు.

రేపు మరోసారి వాదనలు..

రేపు ఉదయం మరోసారి వాదనలు వింటామని అంతవరకు నోటిఫికేషన్ జారీ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పురపాలక ఎన్నికలపై సింగిల్ బెంచ్​లో దాఖలైన రిట్ పిటిషన్లు కూడా రేపటికి వాయిదా పడ్డాయి.

తుది తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు

ఇవీ చూడండి:'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి'

పురపాలక ఎన్నికలపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు పూర్తై తుది తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్​ను సవాల్ చేస్తూ.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇరువైపులా వాదోపవాదాలు నడిచాయి.

కుల ధ్రువీకరణ పత్రం పొందే సమయం కూడా ఇవ్వలేదు..

ఉత్తమ్ కుమార్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించలేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొదట రిజర్వేషన్లు.. ఆ తర్వాత నోటిఫికేషన్, షెడ్యూల్ ప్రకటించాలని.. కానీ అన్నింటికంటే ముందే షెడ్యూల్ ప్రకటించారని ప్రకాశ్ రెడ్డి వాదించారు. రిజర్వేషన్లు ప్రకటించిన రెండు రోజుల తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని... దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం పొందే సమయం కూడా లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నాం..

న్యాయవాది వాదనతో ఏకీభవించిన ధర్మాసనం... రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది సీపీ మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. బరిలో నిలిచే అభ్యర్థులు తమ కులధ్రువీకరణ పత్రం దాఖలు చేయాల్సిన నిబంధన ఏమీ లేదని... తెలంగాణ పురపాలక చట్టం ప్రకారం అభ్యర్థులు డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందని... హైకోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారమే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నామని సీవీ మోహన్ రెడ్డి న్యాయస్థానానికి వివరించారు.

రేపు మరోసారి వాదనలు..

రేపు ఉదయం మరోసారి వాదనలు వింటామని అంతవరకు నోటిఫికేషన్ జారీ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పురపాలక ఎన్నికలపై సింగిల్ బెంచ్​లో దాఖలైన రిట్ పిటిషన్లు కూడా రేపటికి వాయిదా పడ్డాయి.

తుది తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు

ఇవీ చూడండి:'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి'

Last Updated : Jan 6, 2020, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.