ETV Bharat / state

హస్తంలో రాజుకున్న చిచ్చు

నాయకుల మధ్య ఉన్నఅంతర్గత విబేధాలు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీని సతమతం చేస్తున్నాయి. యురేనియం తవ్వకాలపై ముందు నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను అంతర్గత విభేదాలు చుట్టుముట్టాయి. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక వివాదస్పదమై రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జికి రేవంత్​ రెడ్డి ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది.

author img

By

Published : Sep 19, 2019, 5:00 AM IST

Updated : Sep 19, 2019, 8:55 AM IST

హస్తంలో రాజుకున్న చిచ్చు
హస్తంలో రాజుకున్న చిచ్చు

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య ఉన్నవిబేధాలు తొలిగిపోలేదు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు సంబంధించి వివాదం రాజుకుంటోంది. ఆ స్థానంలో అభ్యర్థిత్వంపై పార్టీలో నేతల మధ్య విభేధాలు నెలకొన్నాయి. హుజూర్​నగర్​ స్థానానికి అభ్యర్థి పేరును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తమ్​తోపాటు ఏఐసీసీ కార్యదర్శులు సంపత్​కుమార్​, వంశీచంద్​రెడ్డిపైనా రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్​కుమర్​ రాజీనామాతో హుజూర్​నగర్​ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అక్కడ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పోటీ చేస్తారని ఉత్తమ్​ ఇటీవల ప్రకటించారు. దీనిపై తాజాగా స్పందించిన రేవంత్​ రెడ్డి.. పద్మావతి అభ్యర్థిత్వాన్ని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్​ స్థానిక నాయకుడు చామల కిరణ్​ కుమార్​ రెడ్డిని ప్రతిపాదిస్తానని తెలిపారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కుంతియాను కలిసి రేవంత్​ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వివరణ కోరాలని అడిగినట్లు సమాచారం.

యురేనియంపై ఏబీసీడీలు కూడా రావు:

బుధవారం అసెంబ్లీకి వచ్చిన ఎంపీ రేవంత్​ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్తులో అవినీతి జరిగిందని తాను లేవనెత్తగా... అసెంబ్లీలో చర్చకు వచ్చిన సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు ఎవరూ లేరన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లేటప్పుడు సీఎల్పీ సభ్యుడినైన తనకు సమాచారం అందలేదన్నారు. యురేనియంపై సంపత్‌కుమార్‌కు ఏబీసీడీలు కూడా రావని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశానికి అతను కూడా హాజరయ్యారని.. పవన్‌కళ్యాణ్‌తో సెల్ఫీ దిగేందుకు అవకాశం రాకపోవడంతోనే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో పదవులు ఎప్పుడొస్తాయో... ఎప్పుడు పోతాయో తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆధారాలను త్వరలోనే భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​కు అందచేస్తానని రేవంత్​ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం బడ్జెట్​ సమావేశాలు కనీసం 14 రోజులు జరగాలన్నారు.

ఇవీ చూడండి: రైతు సమన్వయ సమితికి ప్రేరణ అదే: కేసీఆర్

హస్తంలో రాజుకున్న చిచ్చు

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య ఉన్నవిబేధాలు తొలిగిపోలేదు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు సంబంధించి వివాదం రాజుకుంటోంది. ఆ స్థానంలో అభ్యర్థిత్వంపై పార్టీలో నేతల మధ్య విభేధాలు నెలకొన్నాయి. హుజూర్​నగర్​ స్థానానికి అభ్యర్థి పేరును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తమ్​తోపాటు ఏఐసీసీ కార్యదర్శులు సంపత్​కుమార్​, వంశీచంద్​రెడ్డిపైనా రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్​కుమర్​ రాజీనామాతో హుజూర్​నగర్​ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అక్కడ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పోటీ చేస్తారని ఉత్తమ్​ ఇటీవల ప్రకటించారు. దీనిపై తాజాగా స్పందించిన రేవంత్​ రెడ్డి.. పద్మావతి అభ్యర్థిత్వాన్ని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్​ స్థానిక నాయకుడు చామల కిరణ్​ కుమార్​ రెడ్డిని ప్రతిపాదిస్తానని తెలిపారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కుంతియాను కలిసి రేవంత్​ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వివరణ కోరాలని అడిగినట్లు సమాచారం.

యురేనియంపై ఏబీసీడీలు కూడా రావు:

బుధవారం అసెంబ్లీకి వచ్చిన ఎంపీ రేవంత్​ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్తులో అవినీతి జరిగిందని తాను లేవనెత్తగా... అసెంబ్లీలో చర్చకు వచ్చిన సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు ఎవరూ లేరన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లేటప్పుడు సీఎల్పీ సభ్యుడినైన తనకు సమాచారం అందలేదన్నారు. యురేనియంపై సంపత్‌కుమార్‌కు ఏబీసీడీలు కూడా రావని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశానికి అతను కూడా హాజరయ్యారని.. పవన్‌కళ్యాణ్‌తో సెల్ఫీ దిగేందుకు అవకాశం రాకపోవడంతోనే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో పదవులు ఎప్పుడొస్తాయో... ఎప్పుడు పోతాయో తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆధారాలను త్వరలోనే భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​కు అందచేస్తానని రేవంత్​ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం బడ్జెట్​ సమావేశాలు కనీసం 14 రోజులు జరగాలన్నారు.

ఇవీ చూడండి: రైతు సమన్వయ సమితికి ప్రేరణ అదే: కేసీఆర్

TG_Hyd_02_19_CONG_DISPUTES_FOLLOWUP_PKG_3038066 Reporoter: Tirupal Reddy () తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో నివురుగప్పిన నిప్పులా...ఉన్న వేబేధాలు ఒక్కొక్కటే బహిర్గతమవుతున్నాయి. నాయకుల మధ్య ఉన్నఅంతర్గత విబేధాలు కాంగ్రెస్‌ పార్టీని సతమతం చేస్తున్నాయి. యురేనియం తవ్వకాలపై ముందు నుంచి పోరాటం చేస్తున్నకాంగ్రెస్‌ నేతలను అంతర్గత విభేదాలు చుట్టుముట్టాయి. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల అభ్యర్ధి ఎంపిక అంశం కూడా వివాదస్పదమై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జికి ఫిర్యాదు చేసేవరకు వెళ్లడంతో పార్టీలో చిచ్చురేగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. LOOK వాయిస్ఓవర్‌1: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య ఉన్నవిబేధాలు తొలిగిపోలేదు. ఇటీవల దిల్లీలో జరిగిన సమావేశంలో విబేధాలు, బేధాభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి పని చేయాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాటాలు చేయాలని...అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో...శ్రేణుల్లో సన్నగిల్లిన విశ్వాసాన్నితిరిగి తీసుకురావాలని సూచింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిఆశామాసిగా తీసుకోవద్దని..నాయకులు ఇంట్లో కూర్చొని చేయంచొద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నతప్పిదాలను అంశాల వారీగా ఎత్తి చూపేందుకు వీలుగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టిలకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, రేవంత్‌ రెడ్డికి విద్యుత్తు ప్రాజెక్టులు, విద్యుత్తు కొనుగోలు, భూసేకరణలు, మర్రి శశిధర్‌ రెడ్డి బృందానికి కేసీఆర్‌ పాలన, రాజకీయ కార్యకలాపాలు తదితర అంశాల్లో చోటు చేసుకున్న లోటుపాట్లను ఎండగట్టేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగానే ఇటీవల నాయకులంతా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిని సందర్శించారు. ఆ తరువాత విద్యుత్తు ప్రాజెక్టులు, కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటూ రేవంత్ రెడ్డి, సాగునీటి ప్రాజెక్టులపై ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. పార్టీ నాయకుల మధ్య ఉన్న విబేధాలు సమసిపోయి..అంతా ఒకతాటిపై నడుస్తున్నారన్న సంకేతాలను జనంలోకి పంపగలిగారు. వాయిస్‌ఓవర్‌2: అంతా బాగుంది అనుకుంటుండగా...తిరిగి పార్టీలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు మొన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో బట్టబయలయ్యాయి. యురేనియం సమస్యపై పార్టీ పరంగా గతకొంతకాలంగా పోరాటం చేయడంతోపాటు అందుకోసం 17 మంది సభ్యులతో సీనియర్‌ నేత హనుమంతురావు అధ్యక్షతన కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇదే అంశంపై రెండు రోజుల కిందట జనసేన పార్టీ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వి.హనుమంతురావు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌ కుమార్‌, వంశీచంద్‌ రెడ్డిలు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి ఎంపీ రేవంత్‌ రెడ్డికి ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోవడంతో...జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఫోన్‌ చేసి ఆహ్వానించారు. అందులో పాల్గొన్న సమయంలో వీహెచ్‌, ఉత్తమ్‌, రేవంత్‌లకు మాత్రమే మాట్లాడే అవకాశం వచ్చింది. సోమవారం నాడు జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌...పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమక్షంలోనే ఎంపీ రేవంత్‌ రెడ్డి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీకి నష్టం కలిగించారని ఆరోపించారు. ఇదే సమయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌కు మధ్య పదవుల విషయంలో మాటమాట పెరిగి ఇద్దరు దూషణలకు దిగారు. దీంతో సమావేశం అంతా రసాబాసగా మారింది. వాయిస్ఓవర్‌3: ఎంపీ రేవంత్‌ రెడ్డి ఈ పరిణామాలను గమనించి నిన్నఅసెంబ్లీకి వచ్చి మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడిన సమయంలో...పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్తులో అవినీతి జరిగిందని తాను లేవనెత్తగా...అదే అంశంపై అసెంబ్లీలో చర్చకు వచ్చిన సమయంలో...కాంగ్రెస్‌ సభ్యులు ఎవరూ లేరన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌ను కలిసేందుకు వెళ్ళేప్పుడు సీఎల్పీ సభ్యుడినైన తనకు పిలుపు లేదన్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల అభ్యర్ధిని ఎవరిని ప్రకటించలేదని...తాను శ్యామల కిరణ్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. సంపత్‌కుమార్‌కు ఏబీసీడీలు కూడా రావని...పేర్కొన్న రేవంత్‌ రెడ్డి....అతను కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారని....పవన్‌కళ్యాణ్‌తో సెల్ఫీ దిగేందుకు అవకాశం రాకపోవడంతోనే విమర్శలు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పీసీసీ అధ్యక్ష పదవి గురించి రేవంత్ వద్ద ప్రస్తావించగా కాంగ్రెస్‌ పార్టీలో పదవులు ఎప్పుడొస్తాయో...ఎప్పుడు పోతాయో తెలియదన్నారు. వాయిస్ఓవర్‌4: మరో వైపు...గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియాను కలిసిన రేవంత్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ అభ్యర్ధిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఏలా ప్రకటిస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం నిర్ణయం తీసుకోక ముందే ఏలా వెల్లడిస్తారన్న రేవంత్‌ ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేశారని సమాచారం. దీంతో...ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లతానని కుంతియా రేవంత్‌కు చెప్పినట్లు తెలిసింది. ఈ పరిణామాలు అన్నింటిని చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీలో ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి పోతున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలతో పార్టీ ఏమి జరుగుతోంది...ఎటువైపు వెళ్లుతుందో తెలియక...నాయకుల్లో, శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది.
Last Updated : Sep 19, 2019, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.