ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ హైదరాబాద్లో తన వ్యూహాత్మక కేంద్రమైన 'ఓరియన్ కార్యాలయాన్ని' ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని 850 మంది పనిచేసే విధంగా రూపొందించారు. ఇప్పటికే ఈ కేంద్రంలో 700 మంది పనిచేస్తుండగా దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణ నిర్మాణానికి మరో రూ. 70కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సంస్థ భారత కార్యకలాపాల ఎండీ అభిషేక్ తోమర్ తెలిపారు.
సంస్థకు హైదరాబాదే ప్రధానం
ఎస్అండ్పీ గ్లోబల్కు హైదరాబాద్ చాలా ముఖ్యమని, ఇక్కడ సాంకేతికత లభ్యత బాగుందని అభిషేక్ తోమర్ పేర్కొన్నారు. దేశంలో గూర్గావ్, అహ్మదాబాద్ కలిపి 3000 మంది ఉద్యోగులు ఉంటే ఒక్క హైదరాబాద్ కార్యాలయంతో పాటు ఓరియన్ కలిపి సుమారు 4500 మంది ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు.
ఇవీ చూడండి : తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మందకృష్ణ మాదిగ