ETV Bharat / state

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఎస్​హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు

author img

By

Published : Feb 5, 2021, 3:43 PM IST

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్.. ఎస్​హెచ్​ఆర్​సీలో​ ఫిర్యాదు చేశారు. బీసీ, దళిత వర్గాల ఉద్యోగులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

parakala mla, shrc
పరకాల ఎమ్మెల్యే, ఎస్​హెచ్​ఆర్​సీ

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాములు నాయక్... రాష్ట్ర మానవహక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. బీసీ, దళిత వర్గాల ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కమిషన్​ను కోరారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన ఓసీల గర్జన సమావేశంలో బీసీ, దళితులను కించపరిచే విధంగా ధర్మారెడ్డి ప్రసంగించారని రాములు నాయక్​ అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్​ను అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు.

ధర్మారెడ్డి ఇంటిపై భాజాపా నాయకులు దాడి చేస్తే స్పందించిన మంత్రి కేటీఆర్.. అదే ఎమ్మెల్యే తమ జాతిని అవమానపరిచే విధంగా మాట్లాడితే ఎందుకు స్పందించరని రాములు నాయక్​ ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెబితే సరిపోదని, బీసీ, దళిత వర్గాల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఆయనపై సీఎం కేసీఆర్​ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తాను వేసిన కేసును స్వీకరించిన ఎస్​హెచ్​ఆర్​సీ.. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: హైదరాబాద్ సీపీ​తో యూఎస్​ కౌన్సిలేట్​ భద్రతాధికారి భేటీ

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాములు నాయక్... రాష్ట్ర మానవహక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. బీసీ, దళిత వర్గాల ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కమిషన్​ను కోరారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన ఓసీల గర్జన సమావేశంలో బీసీ, దళితులను కించపరిచే విధంగా ధర్మారెడ్డి ప్రసంగించారని రాములు నాయక్​ అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్​ను అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు.

ధర్మారెడ్డి ఇంటిపై భాజాపా నాయకులు దాడి చేస్తే స్పందించిన మంత్రి కేటీఆర్.. అదే ఎమ్మెల్యే తమ జాతిని అవమానపరిచే విధంగా మాట్లాడితే ఎందుకు స్పందించరని రాములు నాయక్​ ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెబితే సరిపోదని, బీసీ, దళిత వర్గాల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఆయనపై సీఎం కేసీఆర్​ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తాను వేసిన కేసును స్వీకరించిన ఎస్​హెచ్​ఆర్​సీ.. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: హైదరాబాద్ సీపీ​తో యూఎస్​ కౌన్సిలేట్​ భద్రతాధికారి భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.