ETV Bharat / state

భవన నిర్మాణ కార్మికులకు నిత్యవసరాలు పంపిణీ - భవన నిర్మాణ కార్మికులు కృషి ఫౌండేషన్​ నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు కృషి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసరాలు, భోజనాన్ని అందించారు. మణికొండ, పుప్పాలగూడ, అల్కాపురి టౌన్​షిప్​ ప్రాంతాల్లో సరకులు అందించినట్లు నిర్వాహకురాలు రూపా రెడ్డి తెలిపారు.

భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ
భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Apr 27, 2020, 11:42 PM IST

హైదరాబాద్​లోని మణికొండ, పుప్పాలగూడ, అల్కాపురి టౌన్​షిప్​ ప్రాంతాల్లోని భవన నిర్మాణ కార్మికులకు కృషి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసరాలు, భోజనాన్ని అందజేశారు. లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 20 వేల మందికి నిత్యవసర సరకులు, భోజనం అందించినట్లు సంస్థ నిర్వాహకురాలు పటోళ్ల రూపా రెడ్డి తెలిపారు.

పేదలకు 7 వేల మాస్కులు పంపిణీ చేశామన్నారు. నిత్యం వేర్వేరు ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నామని తెలిపారు. తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు సైతం ముందంజలో ఉండి రక్తదానం చేశారని ఆమె తెలిపారు.

హైదరాబాద్​లోని మణికొండ, పుప్పాలగూడ, అల్కాపురి టౌన్​షిప్​ ప్రాంతాల్లోని భవన నిర్మాణ కార్మికులకు కృషి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసరాలు, భోజనాన్ని అందజేశారు. లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 20 వేల మందికి నిత్యవసర సరకులు, భోజనం అందించినట్లు సంస్థ నిర్వాహకురాలు పటోళ్ల రూపా రెడ్డి తెలిపారు.

పేదలకు 7 వేల మాస్కులు పంపిణీ చేశామన్నారు. నిత్యం వేర్వేరు ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నామని తెలిపారు. తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు సైతం ముందంజలో ఉండి రక్తదానం చేశారని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి: 'కరోనాపై పోరు సాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.