ETV Bharat / state

కరోనా ఒకరికి.. సమాచారం ఇంకొకరికి.. - Errors in name, address and phone number registration

గ్రేటర్‌ వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని కొవిడ్‌ పరీక్ష కేంద్రాల్లో శాంపిళ్లు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రద్దీ పెరగడంతో రెండు రోజులపాటు వీటిని తీయడం అధికారులు నిలుపుదల చేశారు. మళ్లీ సోమవారం నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతి కేంద్రంలో నిత్యం 150-200 మంది నుంచి సేకరిస్తున్నారు. అక్కడకు వచ్చేవారి పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు నమోదులో సిబ్బంది సక్రమంగా దృష్టి సారించడం లేదు. వాటిని రాసుకోవడంలో తప్పులు దొర్లుతుండడం వల్ల ఒకరికి బదులు వేరే వారికి ఫోన్లు చేస్తున్నారు. నమూనాలిచ్చిన వ్యక్తులకు పాజిటివ్‌ వస్తే వారి అన్ని వివరాలు వైద్య ఆరోగ్యశాఖకు అందించాలి. కొన్ని కేంద్రాల్లో కేవలం ఫోన్‌ నంబర్లతో జాబితాలిస్తున్నారు.

కరోనా ఒకరికి.. సమాచారం ఇంకొకరికి..
కరోనా ఒకరికి.. సమాచారం ఇంకొకరికి..
author img

By

Published : Jun 27, 2020, 10:16 AM IST

  • వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు పనిచేసే కార్యాలయంలో సహ ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. తాను కూడా పరీక్ష చేసుకునేందుకు వనస్థలిపురంలోని ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అతని నమూనాలు సేకరించిన సిబ్బంది పేరు, ఫోన్‌ నంబరును తప్పుగా నమోదు చేశారు. దీనిని గమనించిన యువకుడు వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికే రద్దీ ఉండటంతో మార్పులు చేయకుండా అలానే వదిలేశారు. ఇంతవరకు నివేదిక ఏమైందో తెలియక అతడు ఆందోళన చెందుతున్నాడు.
  • ‘మీకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.. చికిత్స కోసం ఆసుపత్రికి రండి’ అంటూ మహేశ్వరానికి చెందిన ఓ అంగన్‌వాడీ కార్యకర్తకు ఫోన్‌ వచ్చింది. తనకు ఎలాంటి లక్షణాలు లేవని... అసలు తాను నమూనాలే ఇవ్వలేదని ఆమె వాపోయారు. ఓ నర్సు నుంచి నమూనాలు తీసిన సిబ్బంది ఫోన్‌ నంబరు తప్పుగా నమోదు చేసుకోవడంతో ఆమెకు బదులు అంగన్‌వాడీ కార్యకర్తకు సమాచారం వెళ్లినట్లు అధికారులు ఆ తర్వాత గుర్తించారు.

ఆందోళన చెందుతూ..

తాము శాంపిళ్లు ఇవ్వకుండానే కరోనా ఉందని ఫోన్‌ చేసి చెబుతున్నారని వివిధ ప్రాంతాలకు చెందినవారు వాపోతున్నారు. దీనివల్ల నిజమైన బాధితులకు సమాచారం అందడంలో జాప్యం జరుగుతోంది. రోజులు గడిచినా తమకు నివేదిక రాక.. కరోనా ఉందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలకు వెళ్లి ఆరా తీస్తున్నా నిరాశే ఎదురవుతోంది. శాంపిళ్ల సేకరణ వరకే తమ పని అని...పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ వివరాలను స్థానిక వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి తెలుసుకోవాలని తిప్పి పంపుతున్నారు. జనం రద్దీ వల్ల కొన్ని కేంద్రాల్లో జవాబు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో చిరునామా, పేర్లు, చరవాణి నంబరు నమోదులో పకడ్బందీ విధానం అవసరమన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి.

  • వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు పనిచేసే కార్యాలయంలో సహ ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. తాను కూడా పరీక్ష చేసుకునేందుకు వనస్థలిపురంలోని ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అతని నమూనాలు సేకరించిన సిబ్బంది పేరు, ఫోన్‌ నంబరును తప్పుగా నమోదు చేశారు. దీనిని గమనించిన యువకుడు వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికే రద్దీ ఉండటంతో మార్పులు చేయకుండా అలానే వదిలేశారు. ఇంతవరకు నివేదిక ఏమైందో తెలియక అతడు ఆందోళన చెందుతున్నాడు.
  • ‘మీకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.. చికిత్స కోసం ఆసుపత్రికి రండి’ అంటూ మహేశ్వరానికి చెందిన ఓ అంగన్‌వాడీ కార్యకర్తకు ఫోన్‌ వచ్చింది. తనకు ఎలాంటి లక్షణాలు లేవని... అసలు తాను నమూనాలే ఇవ్వలేదని ఆమె వాపోయారు. ఓ నర్సు నుంచి నమూనాలు తీసిన సిబ్బంది ఫోన్‌ నంబరు తప్పుగా నమోదు చేసుకోవడంతో ఆమెకు బదులు అంగన్‌వాడీ కార్యకర్తకు సమాచారం వెళ్లినట్లు అధికారులు ఆ తర్వాత గుర్తించారు.

ఆందోళన చెందుతూ..

తాము శాంపిళ్లు ఇవ్వకుండానే కరోనా ఉందని ఫోన్‌ చేసి చెబుతున్నారని వివిధ ప్రాంతాలకు చెందినవారు వాపోతున్నారు. దీనివల్ల నిజమైన బాధితులకు సమాచారం అందడంలో జాప్యం జరుగుతోంది. రోజులు గడిచినా తమకు నివేదిక రాక.. కరోనా ఉందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలకు వెళ్లి ఆరా తీస్తున్నా నిరాశే ఎదురవుతోంది. శాంపిళ్ల సేకరణ వరకే తమ పని అని...పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ వివరాలను స్థానిక వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి తెలుసుకోవాలని తిప్పి పంపుతున్నారు. జనం రద్దీ వల్ల కొన్ని కేంద్రాల్లో జవాబు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో చిరునామా, పేర్లు, చరవాణి నంబరు నమోదులో పకడ్బందీ విధానం అవసరమన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.