ETV Bharat / state

గతంలో ఉన్న టారీఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు: ఈఆర్సీ

2021-22 సంవత్సరానికి సంబంధించి గతంలో ఉన్న టారిఫ్​ ప్రకారమే విద్యుత్​ ఛార్జీలు కొనసాగుతాయని ఈఆర్సీ వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఛార్జీలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

author img

By

Published : Mar 27, 2021, 9:34 PM IST

Electricity charges as per previous tariff
విద్యుత్ ఛార్జీలపై స్పష్టతనిచ్చిన ఈఆర్సీ

గతంలో ఉన్న టారీఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు కొనసాగుతాయని ఈఆర్సీ వెల్లడించింది. చివరగా 2018 మార్చి 27న విద్యుత్ టారీఫ్ ఆర్డర్ ఇచ్చారని.. ఏఆర్​ఆర్​ ఆ ప్రతిపాదనలనే బహిరంగ విచారణ చేసి.. వాటినే కొనసాగిస్తుందని తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ సప్లయ్ టారీఫ్​లు, క్రాస్ సబ్సిడీ సర్​ఛార్జీలు, అడిషనల్ సర్​ఛార్జీలుగా అమలు చేస్తున్నామని పేర్కొంది.

2019-20, 2020-21, 2021-22 ఏడాదికి సంబంధించి ప్రతిపాదనలు లేకపోవడంతో వాటినే కొనసాగిస్తున్నామని ఈఆర్సీ తెలిపింది. టీఎస్-ట్రాన్స్​కోకు సంబంధించిన జనరల్ సబ్సిడీ-రూ.7,66,500, టీఎస్-ట్రాన్స్​కో ఎస్​.సి.ఎస్​.డి.ఎఫ్​.-రూ.1,78,500, టీఎస్-ట్రాన్స్​కో ఎస్​.టి.ఎస్​.డి.ఎఫ్.-రూ.1,05.000, అసిస్టెంట్ స్పిన్నింగ్ మిల్స్​కు సంబంధించి-రూ.14,500లు ఇలా అన్నీ కలుపుకుని మొత్తం రూ.10,64,500 సబ్సిడీని ప్రభుత్వం 2021-22 బడ్జెట్​లో ఆమోదించిందని ఈఆర్సీ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఛార్జీలే కొనసాగుతాయని ఈఆర్సీ స్పష్టం చేసింది.

గతంలో ఉన్న టారీఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు కొనసాగుతాయని ఈఆర్సీ వెల్లడించింది. చివరగా 2018 మార్చి 27న విద్యుత్ టారీఫ్ ఆర్డర్ ఇచ్చారని.. ఏఆర్​ఆర్​ ఆ ప్రతిపాదనలనే బహిరంగ విచారణ చేసి.. వాటినే కొనసాగిస్తుందని తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ సప్లయ్ టారీఫ్​లు, క్రాస్ సబ్సిడీ సర్​ఛార్జీలు, అడిషనల్ సర్​ఛార్జీలుగా అమలు చేస్తున్నామని పేర్కొంది.

2019-20, 2020-21, 2021-22 ఏడాదికి సంబంధించి ప్రతిపాదనలు లేకపోవడంతో వాటినే కొనసాగిస్తున్నామని ఈఆర్సీ తెలిపింది. టీఎస్-ట్రాన్స్​కోకు సంబంధించిన జనరల్ సబ్సిడీ-రూ.7,66,500, టీఎస్-ట్రాన్స్​కో ఎస్​.సి.ఎస్​.డి.ఎఫ్​.-రూ.1,78,500, టీఎస్-ట్రాన్స్​కో ఎస్​.టి.ఎస్​.డి.ఎఫ్.-రూ.1,05.000, అసిస్టెంట్ స్పిన్నింగ్ మిల్స్​కు సంబంధించి-రూ.14,500లు ఇలా అన్నీ కలుపుకుని మొత్తం రూ.10,64,500 సబ్సిడీని ప్రభుత్వం 2021-22 బడ్జెట్​లో ఆమోదించిందని ఈఆర్సీ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఛార్జీలే కొనసాగుతాయని ఈఆర్సీ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: జలమండలికి విద్యుత్ సరఫరా కట్​ చేయొద్దు : ఎస్​ఈఆర్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.