ETV Bharat / state

విద్యుత్​ బస్సులు రయ్​.. రయ్​..

మెరుగైన సౌకర్యాలతో ప్రజలకు చేరువవుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  మరో సరికొత్త ప్రయోగానికి నాంది పలికింది. నగర వాసులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యుత్​ బస్సులు నగర రోడ్లపై పరుగులు తీశాయి. మొత్తం 40 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ వివిధ మార్గాల్లో శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకోనున్నాయి.

author img

By

Published : Mar 6, 2019, 8:53 AM IST

Updated : Mar 6, 2019, 1:17 PM IST

విద్యుత్​ బస్సులు రయ్​.. రయ్​..
విద్యుత్​ బస్సులు రయ్​.. రయ్​..
నగర వాసులంతా ఎప్పడెప్పుడా అని ఎదురు చూసిన విద్యుత్​ బస్సులు నగర రోడ్లపై పరుగులు తీశాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యుత్ బస్సులను ఆర్టీసీ సీఎండీ సునీల్​ శర్మ మియాపూర్ 2డిపోలో ప్రారంభించారు. కాలుష్య రహిత విద్యుత్ బస్సులు ప్రజా రవాణాకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాయన్నారు. డ్రైవర్​తోపాటు 40 మంది ప్రయాణించవచ్చని, ప్రతి అరగంటకు ఓ బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు.
undefined
అన్నీ విమానాశ్రమానికే
‘ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌’ సంస్థతో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా 40 బస్సులు వచ్చాయి. ప్రస్తుతం ఇవన్నీ వివిధ మార్గాల్లో శంషాబాద్​ విమానాశ్రయానికి చేరనున్నాయి. రూట్ నంబర్​ వన్​లో జేబీఎస్ నుంచి బయలుదేరి సంగీత్, ఉప్పల్, చంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరతాయి. రెండో రూట్​లోని బస్సులు సంగీత్, ట్యాంక్ బండ్, మాసాబ్​ట్యాంక్, పీవీఆర్​ మీదుగా చేరుకుంటాయి. మూడో రూట్ ​లో జేబీఎస్​ నుంచి బేగంపేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాసాబ్​ట్యాంక్, ఓఆర్​ఆర్​ మీదుగా పరుగులు పెట్టనుండగా... నాలుగో రూట్ లోని బస్సులు ఎంజీబీఎస్​ నుంచి హైకోర్ట్, పురాణాపూల్, ఆరాంఘర్​ మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయి. ఐదోరూట్​లోని బస్సులు మియాపూర్ హైటెక్ సిటీ, గచ్చిబౌలీ మీదుగా... ఆరో రూట్​లో బీహెచ్ఈఎల్​, అల్విన్ క్రాస్ రోడ్, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటాయి. రూట్ నం.5, 6లలో ఓల్వా బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
ఆర్టీసీకి భారీగా ఆదా
వీటికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300ల నుంచి 350 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. బ్యాటరీతో నడిచే ఈ బస్సులను మూడు నుంచి మూడున్నర గంటలు ఛార్జింగ్చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. డీజిల్​తో నడిచే బస్సులతో పోలిస్తే విద్యుత్​ బస్సులతో కిలోమీటరుకు 21 రూపాయల వరకూ ఆదా అవుతోందని సంస్థ అంచనా వేస్తోంది. 40 బస్సులతో సగటున ఏడాదికి 10 కోట్లు ఆదా అవుతుందని లెక్కలేస్తున్నారు. కంటోన్మెంట్​ డిపోలో 20, మియాపూర్​ డిపోలో 20 బస్సులు నడపనున్నారు.విద్యుత్ బస్సులతో పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఆర్టీసీ నష్టాలను పూడ్చుకునే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. విద్యుత్ బస్సులు సంస్థకు ఎంతవరకు మేలు చేస్తాయో వేచి చూడాలి.

ఇవీ చదవండి:సాఫ్​ 'హై'దరాబాద్

undefined

విద్యుత్​ బస్సులు రయ్​.. రయ్​..
నగర వాసులంతా ఎప్పడెప్పుడా అని ఎదురు చూసిన విద్యుత్​ బస్సులు నగర రోడ్లపై పరుగులు తీశాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యుత్ బస్సులను ఆర్టీసీ సీఎండీ సునీల్​ శర్మ మియాపూర్ 2డిపోలో ప్రారంభించారు. కాలుష్య రహిత విద్యుత్ బస్సులు ప్రజా రవాణాకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాయన్నారు. డ్రైవర్​తోపాటు 40 మంది ప్రయాణించవచ్చని, ప్రతి అరగంటకు ఓ బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు.
undefined
అన్నీ విమానాశ్రమానికే
‘ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌’ సంస్థతో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా 40 బస్సులు వచ్చాయి. ప్రస్తుతం ఇవన్నీ వివిధ మార్గాల్లో శంషాబాద్​ విమానాశ్రయానికి చేరనున్నాయి. రూట్ నంబర్​ వన్​లో జేబీఎస్ నుంచి బయలుదేరి సంగీత్, ఉప్పల్, చంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరతాయి. రెండో రూట్​లోని బస్సులు సంగీత్, ట్యాంక్ బండ్, మాసాబ్​ట్యాంక్, పీవీఆర్​ మీదుగా చేరుకుంటాయి. మూడో రూట్ ​లో జేబీఎస్​ నుంచి బేగంపేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాసాబ్​ట్యాంక్, ఓఆర్​ఆర్​ మీదుగా పరుగులు పెట్టనుండగా... నాలుగో రూట్ లోని బస్సులు ఎంజీబీఎస్​ నుంచి హైకోర్ట్, పురాణాపూల్, ఆరాంఘర్​ మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయి. ఐదోరూట్​లోని బస్సులు మియాపూర్ హైటెక్ సిటీ, గచ్చిబౌలీ మీదుగా... ఆరో రూట్​లో బీహెచ్ఈఎల్​, అల్విన్ క్రాస్ రోడ్, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటాయి. రూట్ నం.5, 6లలో ఓల్వా బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
ఆర్టీసీకి భారీగా ఆదా
వీటికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300ల నుంచి 350 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. బ్యాటరీతో నడిచే ఈ బస్సులను మూడు నుంచి మూడున్నర గంటలు ఛార్జింగ్చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. డీజిల్​తో నడిచే బస్సులతో పోలిస్తే విద్యుత్​ బస్సులతో కిలోమీటరుకు 21 రూపాయల వరకూ ఆదా అవుతోందని సంస్థ అంచనా వేస్తోంది. 40 బస్సులతో సగటున ఏడాదికి 10 కోట్లు ఆదా అవుతుందని లెక్కలేస్తున్నారు. కంటోన్మెంట్​ డిపోలో 20, మియాపూర్​ డిపోలో 20 బస్సులు నడపనున్నారు.విద్యుత్ బస్సులతో పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఆర్టీసీ నష్టాలను పూడ్చుకునే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. విద్యుత్ బస్సులు సంస్థకు ఎంతవరకు మేలు చేస్తాయో వేచి చూడాలి.

ఇవీ చదవండి:సాఫ్​ 'హై'దరాబాద్

undefined
Intro:TG_KRN_09_05_KTR_SABHA_CURTNIZE_AB_C5

1( )తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 16 స్థానాలను తెరాస కైవసం చేసుకునేందుకు సెంటిమెంట్ గా అచ్చి వచ్చిన కరీంనగర్ నుంచి పార్లమెంటరీ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించి ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితిlook..

vo..1.. తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను తెరాస కైవసం చేసుకునేందుకు కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ సన్నాహక సభను నిర్వహించనున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పగ్గాలు చేపట్టిన కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు సన్నాహక సభ లో పాల్గొన్నారు కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పార్లమెంటరీ ఎన్నికల ప్రచారానికి కెటి రామారావు శంఖారావం పూరించనున్నారు ఇదే కళాశాల మైదానంలో సింహ గర్జన సభను నిర్వహించారు కెసిఆర్ విజయాన్ని సాధించారని అదే సెంటిమెంట్ తో పార్లమెంటరీ ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచే పునాది వేస్తున్నారు తెరాస నాయకులు

vo..2.. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన కెటి రామారావు మొదటిసారిగా కరీంనగర్ కు రానున్న నేపథ్యంలో తెరాస నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో 10 గంటలకు సన్నాహక సభ ప్రారంభం కానుండగా కరీంనగర్ శివారు ఎల్ఇడి బ్రిడ్జి నుంచి కెటి రామారావుకు తెరాస కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్నారు తెరాస కార్యకర్తలు అభిమానులు కరీంనగర్ నగరాన్ని గులాబీ మాయం చేశారు పలు కూడళ్లలో కేటీఆర్ తో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు

vo..2.. ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో సన్నాహక సభ ఏర్పాట్లను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దగ్గర ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు ఎండలో మండుతున్న డంతో చలువ పందిళ్లను వేశారు కార్యకర్తలకు అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు చేస్తున్నామని గంగుల పేర్కొన్నారు ఈ సన్నాహక సభ కు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం లోని ఏడు నియోజకవర్గాల నుంచి దాదాపు 25 వేల మంది పాల్గొన్నారు ఎండాకాలం కావడంతో కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిరి లతోపాటు ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయం భోజన వసతి కల్పించనున్నారు సన్నాహక సభ కు ఏడు నియోజకవర్గాల్లో ని ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్ మేయర్ లో పాల్గొనున్నారు

vo..3.. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి మొదటిసారి కరీంనగర్ కేటీఆర్ రా నున్న నేపథ్యంలో సన్నాహక సభ కు పెద్ద మొత్తంలో ప్రజలు కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నది పార్లమెంటరీ ఎన్నికల ఉద్దేశించి కేటీఆర్ ఉపన్యాసం వినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు

బైట్ సుంకె రవిశంకర్ చొప్పదండి ఎమ్మెల్యే
బైట్ గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే


Body:బ్


Conclusion:న్
Last Updated : Mar 6, 2019, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.