ETV Bharat / state

Election Commission Grievance Cell Telangana : పోలీసుల తనిఖీల్లో మీ సొత్తు సీజ్ అయిందా.. రూ.10 లక్షలోపు ఉంటే.. 48 గంటల్లో వాపస్

Election Commission Grievance Cell : రాష్ట్రంలో ఎన్నికలకోడ్​ అమలుతో.. పోలీసుల తనిఖీలు విస్తృతమయ్యాయి. రూ. 50వేలకు పైన నగదు, 10 గ్రాములకు పైగా బంగారం కనిపించిందంటే చాలు స్వాధీనం చేసుకుని.. ఆదాయశాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. నగదు స్వాధీనంపై.. సాామాన్యుల నుంచి విమర్శల నేపథ్యంలో ఎలక్షన్​ కమిషన్​ గ్రీవెన్స్ సెల్​ను ఏర్పాటు చేసింది. రూ. 10 లక్షలలోపు సీజ్​ చేసిన సొమ్ముకు సరైన ఆధారాలు సమర్పిస్తే.. 48 గంటలలోపు తిరిగిచ్చేస్తామని ఈసీ ప్రకటించింది.

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 11:50 AM IST

How to Get Seize Money in Grievance Cell
Election Commission Grievance Cell

Election Commission Grievance Cell : రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలుతో వ్యాపారులు, హవాలాదారులు, పౌరులను ఒకే విధంగా చూస్తూ.. 10 గ్రాములకుపైగా బంగారం, రూ.50 వేలకుపైగా నగదు, కనిపిస్తే చాలు.. రెడ్​ హ్యాండెడ్​గా స్వాధీనం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్​ కమిషన్​(Election Commission) స్పందించింది. సామాన్యులు జప్తు చేసిన సొమ్మును తిరిగి పొందేందుకు.. ప్రతి జిల్లాలో గ్రీవెన్స్‌సెల్‌ను ఏర్పాటు చేసింది.

How to Get Seize Money in Grievance Cell : పోలీసుల నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడ్డ డబ్బు, బంగారు ఆభరణాలను సదరు వ్యక్తులు ఈ సెల్‌ ఛైర్మన్‌ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లో తిరిగిచ్చేస్తారు. అయితే వీటి విలువ మాత్రం రూ.10 లక్షలలోపు మాత్రమే ఉండాలని.. నిబంధన వర్తింపజేస్తున్నారు. ఒకవేళ అంతకు మించి పట్టుబడితే ఆదాయ పన్నుశాఖ అధికారులకు సంబంధిత వివరాలు వెల్లడించాలి.

Huge Amount of Money Seized in Telangana : పాత రికార్డులన్నీ ఢమాల్​.. పోలీసుల తనిఖీల్లో రూ.243 కోట్లు సీజ్

అనంతరం వారు విచారణ చేసి.. చట్టపరమైన అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌.. రోజుకు ఇటువంటి పదికిపైగా సమస్యలను పరిష్కరిస్తోంది. సరైన పత్రాలు సమర్పించిన వ్యక్తులకు జప్తు చేసిన సొమ్మును తిరిగి అప్పగించేస్తున్నారు. ఎన్నికల నియమావళి నేపథ్యంలో బంగారం, డబ్బును.. పోలీసులు, తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్​స్టేషన్​లో భద్రపరిచి కేసు నమోదు చేస్తారు. సదరు సమాచారాన్ని సంబంధిత యజమానులకు ఇస్తారు. జప్తు చేసిన అనంతరం.. భద్రపరిచిన సొమ్ము వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారం, ఆదాయశాఖ అధికారులకు తెలియజేస్తారు.

గ్రీవెన్స్​సెల్​కు దరఖాస్తు చేయండిలా..

  • జప్తు చేసిన సొమ్మును తిరిగి పొందాలనుకునేవారు.. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాల పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో చూపించాలి. అక్కడి అధికారులు పరిశీలించిన అనంతరం దానిని గ్రీవెన్స్‌సెల్‌కు పంపిస్తారు.
  • తరువాత కలెక్టర్​ ఆఫీస్​లోని గ్రీవెన్స్‌సెల్‌ ఛైర్మన్‌ను కలిస్తే కేసు వివరాలు, ఆధారాలు స్వీకరిస్తారు. వీటికి సంబంధించి ఓ రశీదు ఇచ్చి తమ సెల్‌ అధికారులు ఫోన్‌ చేసినప్పుడు రావాలని సూచిస్తారు.
  • 48 గంటల్లోపు గ్రీవెన్స్ సెల్ అధికారులు.. సదరు బాధితులను పిలిపించి వారు ఇచ్చిన ఆధారాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. అన్ని వివరాలు సరిగా ఉంటే రిటర్నింగ్‌ అధికారికి తెలియజేస్తారు.
  • ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి నిర్ధారించాక.. జప్తు చేసిన సొత్తు తిరిగివ్వాలని వాటిని నిల్వ చేసిన పోలీస్​స్టేషన్​కు ఆదేశాలు జారీ చేస్తారు. బాధితులు ఠాణాకు వెళ్లి.. వారి సొమ్మును తీసుకోవాల్సి ఉంటుంది.

2 Crore Money Seize in Karimnagar : కరీంనగర్​లో రూ.2.36 కోట్లు సీజ్

Police Seize 2KG Gold in Hyderabad : పోలీసుల ముమ్మర తనిఖీలు.. వేర్వేరు చోట్ల 2 కిలోల బంగారం, రూ. 20 లక్షలు స్వాధీనం

Election Commission Grievance Cell : రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలుతో వ్యాపారులు, హవాలాదారులు, పౌరులను ఒకే విధంగా చూస్తూ.. 10 గ్రాములకుపైగా బంగారం, రూ.50 వేలకుపైగా నగదు, కనిపిస్తే చాలు.. రెడ్​ హ్యాండెడ్​గా స్వాధీనం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్​ కమిషన్​(Election Commission) స్పందించింది. సామాన్యులు జప్తు చేసిన సొమ్మును తిరిగి పొందేందుకు.. ప్రతి జిల్లాలో గ్రీవెన్స్‌సెల్‌ను ఏర్పాటు చేసింది.

How to Get Seize Money in Grievance Cell : పోలీసుల నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడ్డ డబ్బు, బంగారు ఆభరణాలను సదరు వ్యక్తులు ఈ సెల్‌ ఛైర్మన్‌ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లో తిరిగిచ్చేస్తారు. అయితే వీటి విలువ మాత్రం రూ.10 లక్షలలోపు మాత్రమే ఉండాలని.. నిబంధన వర్తింపజేస్తున్నారు. ఒకవేళ అంతకు మించి పట్టుబడితే ఆదాయ పన్నుశాఖ అధికారులకు సంబంధిత వివరాలు వెల్లడించాలి.

Huge Amount of Money Seized in Telangana : పాత రికార్డులన్నీ ఢమాల్​.. పోలీసుల తనిఖీల్లో రూ.243 కోట్లు సీజ్

అనంతరం వారు విచారణ చేసి.. చట్టపరమైన అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌.. రోజుకు ఇటువంటి పదికిపైగా సమస్యలను పరిష్కరిస్తోంది. సరైన పత్రాలు సమర్పించిన వ్యక్తులకు జప్తు చేసిన సొమ్మును తిరిగి అప్పగించేస్తున్నారు. ఎన్నికల నియమావళి నేపథ్యంలో బంగారం, డబ్బును.. పోలీసులు, తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్​స్టేషన్​లో భద్రపరిచి కేసు నమోదు చేస్తారు. సదరు సమాచారాన్ని సంబంధిత యజమానులకు ఇస్తారు. జప్తు చేసిన అనంతరం.. భద్రపరిచిన సొమ్ము వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారం, ఆదాయశాఖ అధికారులకు తెలియజేస్తారు.

గ్రీవెన్స్​సెల్​కు దరఖాస్తు చేయండిలా..

  • జప్తు చేసిన సొమ్మును తిరిగి పొందాలనుకునేవారు.. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాల పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో చూపించాలి. అక్కడి అధికారులు పరిశీలించిన అనంతరం దానిని గ్రీవెన్స్‌సెల్‌కు పంపిస్తారు.
  • తరువాత కలెక్టర్​ ఆఫీస్​లోని గ్రీవెన్స్‌సెల్‌ ఛైర్మన్‌ను కలిస్తే కేసు వివరాలు, ఆధారాలు స్వీకరిస్తారు. వీటికి సంబంధించి ఓ రశీదు ఇచ్చి తమ సెల్‌ అధికారులు ఫోన్‌ చేసినప్పుడు రావాలని సూచిస్తారు.
  • 48 గంటల్లోపు గ్రీవెన్స్ సెల్ అధికారులు.. సదరు బాధితులను పిలిపించి వారు ఇచ్చిన ఆధారాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. అన్ని వివరాలు సరిగా ఉంటే రిటర్నింగ్‌ అధికారికి తెలియజేస్తారు.
  • ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి నిర్ధారించాక.. జప్తు చేసిన సొత్తు తిరిగివ్వాలని వాటిని నిల్వ చేసిన పోలీస్​స్టేషన్​కు ఆదేశాలు జారీ చేస్తారు. బాధితులు ఠాణాకు వెళ్లి.. వారి సొమ్మును తీసుకోవాల్సి ఉంటుంది.

2 Crore Money Seize in Karimnagar : కరీంనగర్​లో రూ.2.36 కోట్లు సీజ్

Police Seize 2KG Gold in Hyderabad : పోలీసుల ముమ్మర తనిఖీలు.. వేర్వేరు చోట్ల 2 కిలోల బంగారం, రూ. 20 లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.