కేరళలో వరద బాధితుల కోసం రామోజీ గ్రూపు నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఈనాడు ఎండీ కిరణ్ హాజరయ్యారు. ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉంటుందని కిరణ్ చెప్పారు. తెలుగు ప్రజలు ఈ దిశగా తమకు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ సాయంలో సంస్థ ఉద్యోగుల భాగస్వామ్యమూ ఉందన్నారు. ఈ ఇళ్లను నిర్మించిన 'కుటుంబ శ్రీ' సంస్థ కృషిని కిరణ్ కొనియాడారు. తమ సంకల్పంలో కీలక పాత్ర పోషించిన యువ ఐఏఎస్ కృష్ణతేజకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:
మా కంటే రామోజీ గ్రూప్ తపనే ఎక్కువ: సీఎం విజయన్