ETV Bharat / state

సుకేశ్ గుప్తాను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్..

ED Officials Have Filed A Petition In Court: ఎంబీఎస్ జ్యువెల్లర్స్ అధినేత సుకేశ్ గుప్తాను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారాన్ని విక్రయించగా వచ్చిన నగదును ఎక్కడికి మళ్లించారనే వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఈ మోసంలో ఇంకెవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ అధికారులు పిటిష​న్​లో పేర్కొన్నారు.

author img

By

Published : Oct 20, 2022, 5:06 PM IST

ED
ED

ED Officials Have Filed A Petition In Court: ఎంబీఎస్ జ్యువెల్లర్స్ అధినేత సుకేశ్ గుప్తాను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారాన్ని విక్రయించగా వచ్చిన నగదును ఎక్కడికి మళ్లించారనే వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఈ మోసంలో ఇంకెవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ అధికారులు పిటిషన్​లో పేర్కొన్నారు.

సుకేశ్ గుప్తాను కస్టడీకి అనుమతిస్తే ఆయనను ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఈడీ అధికారులు తెలిపారు. సుకేష్ గుప్తాను ఈడీ అధికారులు నిన్న అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్​కు తరలించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

గతేడాది ఆగస్టులో ఎంబీఎస్ జ్యువెల్లర్స్​​కు చెందిన రూ.363కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ అధికారులు రెండు రోజుల క్రితం మరోసారి ముసద్దీలాల్ జ్యువెల్లర్స్​లో సోదాలు చేసి రూ.150 కోట్ల విలువైన బంగారు వజ్రాభరణాలతో పాటు బినామీ ఆస్తులను సీజ్ చేశారు.

ఇవీ చదవండి:

ED Officials Have Filed A Petition In Court: ఎంబీఎస్ జ్యువెల్లర్స్ అధినేత సుకేశ్ గుప్తాను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారాన్ని విక్రయించగా వచ్చిన నగదును ఎక్కడికి మళ్లించారనే వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఈ మోసంలో ఇంకెవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ అధికారులు పిటిషన్​లో పేర్కొన్నారు.

సుకేశ్ గుప్తాను కస్టడీకి అనుమతిస్తే ఆయనను ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఈడీ అధికారులు తెలిపారు. సుకేష్ గుప్తాను ఈడీ అధికారులు నిన్న అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్​కు తరలించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

గతేడాది ఆగస్టులో ఎంబీఎస్ జ్యువెల్లర్స్​​కు చెందిన రూ.363కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ అధికారులు రెండు రోజుల క్రితం మరోసారి ముసద్దీలాల్ జ్యువెల్లర్స్​లో సోదాలు చేసి రూ.150 కోట్ల విలువైన బంగారు వజ్రాభరణాలతో పాటు బినామీ ఆస్తులను సీజ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.