ETV Bharat / state

revanth reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

author img

By

Published : May 27, 2021, 3:30 PM IST

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి సహా పలువురిపై ఈడీ ఛార్జ్​షీట్ దాఖలు చేసింది. ఎమ్మెల్యే స్టీఫెన్​సన్​కు లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారనే అభియోగంపై ఈడీ విచారణ జరిపింది.

vote for note case
vote for note case

ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ,సెబాస్టియన్‌, ఉదయ్‌సింహా, మత్తయ్య జరుసలేం, వేం కృష్ణకీర్తన్‌పై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఓటుకు నోటు కేసులో అభియోగాలపై ఈడీ విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే స్టీఫెన్​సన్​కు లంచం ఇస్తుండగా రేవంత్​ రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.50 లక్షలను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర పన్నినట్లు ఈడీ పేర్కొంది. ఎమ్మెల్యే స్టీఫన్‌సన్‌కు ముడుపులు ఇచ్చి ప్రలోభపెట్టాలని చూశారని ఆరోపించింది. ఏసీబీ ఛార్జిషీటు ఆధారంగా ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.

ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ,సెబాస్టియన్‌, ఉదయ్‌సింహా, మత్తయ్య జరుసలేం, వేం కృష్ణకీర్తన్‌పై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఓటుకు నోటు కేసులో అభియోగాలపై ఈడీ విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే స్టీఫెన్​సన్​కు లంచం ఇస్తుండగా రేవంత్​ రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.50 లక్షలను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర పన్నినట్లు ఈడీ పేర్కొంది. ఎమ్మెల్యే స్టీఫన్‌సన్‌కు ముడుపులు ఇచ్చి ప్రలోభపెట్టాలని చూశారని ఆరోపించింది. ఏసీబీ ఛార్జిషీటు ఆధారంగా ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.

ఇదీ చూడండి: Inter Exams: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.