ETV Bharat / state

సచివాలయంలో ఆరు శాఖల్లో ఈ-ఆఫీస్ విధానం ప్రారంభం - e office started in six departments of secretariat in telangana

హైదరాబాద్​లోని సచివాలయంలో మొదటగా సాధారణ పరిపాలన, ఐటీ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, సీసీఎల్ఏ, మహిళా-శిశు సంక్షేమ శాఖల్లో ఈ-ఆఫీస్ విధానాన్ని సీఎస్ సోమేశ్​కుమార్ ప్రారంభించారు. కాగితాలు, దస్త్రాలతో సంబంధం లేకుండా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ధ్యేయంగా ఈ విధానం ప్రారంభించినట్లు సీఎస్ తెలిపారు.

e office started in telangana secretariat
సచివాలయంలో ఆరు శాఖల్లో ఈ-ఆఫీస్ విధానం ప్రారంభం
author img

By

Published : Jul 18, 2020, 8:40 PM IST

కాగితాలు, దస్త్రాలతో సంబంధం లేకుండా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ధ్యేయంగా హైదరాబాద్​లోని సచివాలయంలో ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. మొదటగా ఆరు శాఖల్లో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇచ్చారు. సాధారణ పరిపాలన, ఐటీ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, సీసీఎల్ఏ, మహిళా-శిశు సంక్షేమ శాఖల్లో ఈ-ఆఫీస్​ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ ప్రారంభించారు.

ఈ-ఆఫీస్ ద్వారా 1600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని, ఈ విధానం పూర్తి పారదర్శకతను తీసుకొస్తుందని, ప్రయోజనకరంగా ఉంటుందని సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ-ఆఫీస్ విధానం ఎంతో విలువైన సమయాన్ని, కాగితాన్ని పొదుపు చేస్తుందని అన్నారు. కాగితాలతో సంబంధం లేకుండా ఈ-ఆఫీస్ విధానం ద్వారా పనిచేయడం సౌకర్యవంతంగా ఉందని అధికారులు, ఉద్యోగులు తెలిపారు.

కాగితాలు, దస్త్రాలతో సంబంధం లేకుండా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ధ్యేయంగా హైదరాబాద్​లోని సచివాలయంలో ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. మొదటగా ఆరు శాఖల్లో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇచ్చారు. సాధారణ పరిపాలన, ఐటీ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, సీసీఎల్ఏ, మహిళా-శిశు సంక్షేమ శాఖల్లో ఈ-ఆఫీస్​ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ ప్రారంభించారు.

ఈ-ఆఫీస్ ద్వారా 1600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని, ఈ విధానం పూర్తి పారదర్శకతను తీసుకొస్తుందని, ప్రయోజనకరంగా ఉంటుందని సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ-ఆఫీస్ విధానం ఎంతో విలువైన సమయాన్ని, కాగితాన్ని పొదుపు చేస్తుందని అన్నారు. కాగితాలతో సంబంధం లేకుండా ఈ-ఆఫీస్ విధానం ద్వారా పనిచేయడం సౌకర్యవంతంగా ఉందని అధికారులు, ఉద్యోగులు తెలిపారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.