రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్న రోజుల్లో భూముల క్రయవిక్రయాలు చేయడం సాధ్యం కాదని.. అందువల్ల ఈనెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భూముల రిజిస్ట్రేషన్ చేయాలంటే కనీసం నలుగురు అవసరం ఉంటుందని... ఆ సమయంలో ఇద్దరు సాక్షులతో రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే పరిస్థితి లేదని సీఎస్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాల్లో ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఈ నెల 21 తర్వాత రీషెడ్యూలు చేస్తామని వెల్లడించారు. అప్పటి వరకు మండల రెవెన్యూ అధికారులు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయొద్దని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
ఇదీ చూడండి: 'అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు'