ETV Bharat / state

శివరాత్రి ప్రత్యేకం: కిక్కిరిసిపోయిన కాశీ బుగ్గ ఆలయం

author img

By

Published : Mar 12, 2021, 12:03 PM IST

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని కాశీబుగ్గ దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Devotees flocked to the Kasibugga temple in the old city of Hyderabad
కిక్కిరిసిపోయిన కాశీ బుగ్గ ఆలయం

మహాశివరాత్రిని పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీలోని కిషన్​బాగ్ కాశీ బుగ్గ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి చేరాలంటే మూసీ నదిలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుండటంతో మూసీ నదిపై ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 70 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు బహదూర్​పూర్ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

ఇదీ చూడండి: పిల్లికి పాలుపోయాలంటూ... పక్కాగా ప్లాన్‌

మహాశివరాత్రిని పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీలోని కిషన్​బాగ్ కాశీ బుగ్గ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి చేరాలంటే మూసీ నదిలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుండటంతో మూసీ నదిపై ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 70 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు బహదూర్​పూర్ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

ఇదీ చూడండి: పిల్లికి పాలుపోయాలంటూ... పక్కాగా ప్లాన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.