ETV Bharat / state

'తహసీల్దార్​ హత్యకు నిరసనగా 3రోజులు విధుల బహిష్కరణ'

తహసీల్దార్‌ విజయారెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలిరావాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు నేతలు పిలుపునిచ్చారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజుల పాటు విధులను బహిష్కరించాలని నిర్ణయించారు.

author img

By

Published : Nov 5, 2019, 12:21 PM IST

మూడు రోజులు విధుల బహిష్కరణ: రెవెన్యూ ఉద్యోగ సంఘాలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనను రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకి నిరసనగా 3 రోజుల పాటు విధులను బహిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 4, 5, 6వ తేదీలు సంతాప దినాలు పాటించడంతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ దుశ్చర్యను ఖండిచాలని నిర్ణయించారు.

మూడు రోజులు విధుల బహిష్కరణ: రెవెన్యూ ఉద్యోగ సంఘాలు

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్య పట్ల రేణుకా చౌదరి దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనను రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకి నిరసనగా 3 రోజుల పాటు విధులను బహిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 4, 5, 6వ తేదీలు సంతాప దినాలు పాటించడంతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ దుశ్చర్యను ఖండిచాలని నిర్ణయించారు.

మూడు రోజులు విధుల బహిష్కరణ: రెవెన్యూ ఉద్యోగ సంఘాలు

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్య పట్ల రేణుకా చౌదరి దిగ్భ్రాంతి

TG_HYD_10_05_REVENUE_EMPLOYES_ATTEND_MRO_FUNERALS_DRY_3182061 రిపోర్టర్‌: జ్యోతికిరణ్‌ ( ) నేడు జరిగే తహశీల్ధార్‌ విజయారెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌ తరలిరావాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. హత్యకు నిరసనగా మూడు రోజుల పాటు విధుల బహిష్కరించాలని నిర్ణయించాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. ఈ దారుణం గురించి తెలియగానే భారీ సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్ – విజయవాడ హైవేపై బైఠాయించారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వారికి సర్దిచెప్పి.. నిరసన విరమింపజేశారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ ( ట్రెసా ), డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహశీల్దార్ల సంఘం,వీఆర్వో, వీఆర్ఏ ఐకాసలు తహసీల్దార్ విజయా రెడ్డి హత్యకి నిరసనగా రాష్ట్రంలోని ఉద్యోగులందరూ 3 రోజుల పాటు 4,5,6 తేదీలు సంతాప దినాలు పాటించడంతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి దుశ్చర్యను ఖండిచాలని పిలుపునిచ్చారు.......Vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.