ETV Bharat / state

రాష్ట్రంలో ఉద్యానశాఖలో పోస్టుల భర్తీలో జాప్యం.. ఆందోళనకు దిగిన విద్యార్థులు

Delay in Recruitment of Telangana Horticulture : రాష్ట్రంలో ఉద్యానరంగానికి సర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నా పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోంది. 20 ఏళ్లుగా ఉద్యానశాఖలో విస్తరణ అధికారుల ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల పట్టభద్రులకు ఉద్యోగాలు రావట్లేదు. ఆ నేపథ్యంలో కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ పరిధిలోని విద్యార్థులు తరగతులు బహిష్కరించి పోరుబాటపట్టారు. వెంటనే ఉద్యానశాఖ హెచ్​ఈవో పోస్టులు సృష్టించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

author img

By

Published : Feb 9, 2023, 1:38 PM IST

Horticulture Students Struggle Fill Posts
Horticulture Students Struggle Fill Posts
రాష్ట్రంలో ఉద్యానశాఖలో పోస్టుల భర్తీలో జాప్యం.. ఆందోళనకు దిగిన విద్యార్థులు

Delay in Recruitment of Telangana Horticulture : రాష్ట్రంలో ఉద్యాన విద్యార్థులు పోరుబాట పట్టారు. ధీర్ఘకాలంగా ఉద్యాన విస్తరణ అధికారుల పోస్టుల భర్తీలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులు తరగతులు బహిష్కరించి ధర్నాకు దిగారు. రెండుదశాబ్ధాలుగా హెచ్​ఈవో పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు.

Delay in Telangana Horticulture Posts : గతంలో వ్యవసాయశాఖ నుంచి డిప్యూటేషన్‌పై ఉద్యానశాఖలో హెచ్​ఈవోలుగా చేరి పదవీ విరమణ తర్వాత కొత్తగా నియమకాలు చేపట్టిన దాఖలాలు లేవు. వ్యవసాయశాఖ తరహాలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌కి ఏఈవోని నియమించినట్లే ఉద్యానశాఖలోనూ ప్రతి 5 వేల ఎకరాలకు ఒక హెచ్​ఈవో చొప్పున నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

వ్యవసాయశాఖ తరహాలో దామాషా ప్రకారం చూసినా 13 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పండ్లు, పూలు, కూరగాయలు, ఔషధ, సుగంధ పంటలు సాగవుతున్నాయి. ఆయా పంటల సాగు విస్తీర్ణం దృష్ట్యా 230పైగా హెచ్​ఈవో పోస్టుల భర్తీ తప్పనిసరి. రాబోయే మూడేళ్లల్లో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్‌ సాగులోకి తేవాలని ప్రభుత్వం, ఉద్యానశాఖ నిర్ణయించినందున 400 మంది హెచ్​ఈవోల అవసరం ఉంటుంది.

దాదాపు 650కి పైగా హెచ్​ఈవో పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా ఇంకా టీఎస్​పీఎస్సీలో కొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ పేరు నమోదు కాలేదని పట్టభద్రులు వాపోతున్నారు. రెండురోజులుగా తరగతులు బహిష్కరించి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్పందించింది. ఆ అంశం వర్సిటీ పరిధిలో లేనందున ఓ విద్యార్థి ప్రతినిధి బృందాన్ని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు వద్దకు తీసుకెళ్లి సమస్య తీవ్రత వివరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిన తరుణంలో టీఎస్​పీస్సీతో ఉద్యాన వర్సిటీ సంప్రదింపులు చేస్తోంది. కొత్తగా హెచ్​ఈవో పోస్టులు సృష్టించడం ద్వారా తొలి నోటిఫికేషన్ విడుదల చేయించేందుకు చర్యలు చేపట్టింది.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో ఉద్యానశాఖలో పోస్టుల భర్తీలో జాప్యం.. ఆందోళనకు దిగిన విద్యార్థులు

Delay in Recruitment of Telangana Horticulture : రాష్ట్రంలో ఉద్యాన విద్యార్థులు పోరుబాట పట్టారు. ధీర్ఘకాలంగా ఉద్యాన విస్తరణ అధికారుల పోస్టుల భర్తీలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులు తరగతులు బహిష్కరించి ధర్నాకు దిగారు. రెండుదశాబ్ధాలుగా హెచ్​ఈవో పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు.

Delay in Telangana Horticulture Posts : గతంలో వ్యవసాయశాఖ నుంచి డిప్యూటేషన్‌పై ఉద్యానశాఖలో హెచ్​ఈవోలుగా చేరి పదవీ విరమణ తర్వాత కొత్తగా నియమకాలు చేపట్టిన దాఖలాలు లేవు. వ్యవసాయశాఖ తరహాలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌కి ఏఈవోని నియమించినట్లే ఉద్యానశాఖలోనూ ప్రతి 5 వేల ఎకరాలకు ఒక హెచ్​ఈవో చొప్పున నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

వ్యవసాయశాఖ తరహాలో దామాషా ప్రకారం చూసినా 13 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పండ్లు, పూలు, కూరగాయలు, ఔషధ, సుగంధ పంటలు సాగవుతున్నాయి. ఆయా పంటల సాగు విస్తీర్ణం దృష్ట్యా 230పైగా హెచ్​ఈవో పోస్టుల భర్తీ తప్పనిసరి. రాబోయే మూడేళ్లల్లో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్‌ సాగులోకి తేవాలని ప్రభుత్వం, ఉద్యానశాఖ నిర్ణయించినందున 400 మంది హెచ్​ఈవోల అవసరం ఉంటుంది.

దాదాపు 650కి పైగా హెచ్​ఈవో పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా ఇంకా టీఎస్​పీఎస్సీలో కొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ పేరు నమోదు కాలేదని పట్టభద్రులు వాపోతున్నారు. రెండురోజులుగా తరగతులు బహిష్కరించి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్పందించింది. ఆ అంశం వర్సిటీ పరిధిలో లేనందున ఓ విద్యార్థి ప్రతినిధి బృందాన్ని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు వద్దకు తీసుకెళ్లి సమస్య తీవ్రత వివరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిన తరుణంలో టీఎస్​పీస్సీతో ఉద్యాన వర్సిటీ సంప్రదింపులు చేస్తోంది. కొత్తగా హెచ్​ఈవో పోస్టులు సృష్టించడం ద్వారా తొలి నోటిఫికేషన్ విడుదల చేయించేందుకు చర్యలు చేపట్టింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.