డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల ప్రక్రియను ఉన్నత విద్యా మండలి వాయిదా వేసింది. బుధవారం నుంచి డిగ్రీ ప్రవేశాలు చేపట్టేందుకు ఇటీవల దోస్త్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కరోనా తీవ్రత కారణంగా జులై 1నుంచి జరగాల్సిన రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు వాయిదా వేసినట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన తేదీలను తర్వాత వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్