ETV Bharat / state

ఒకే క్యాష్ కౌంటర్​... విద్యార్థుల ఇబ్బందులు - హైదరాబాద్​లోని నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థుల సమస్యలు

బషీర్​బాగ్​లో నిజాం కళాశాల ప్రవేశాల కోసం ధ్రువ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. చలానా కోసం ఒకే క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాం కాలేజీ ప్రిన్సిపల్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

degree-admissions-at-nizam-collage-in-hyderabad
ఒకే క్యాష్ కౌంటర్​... విద్యార్థుల ఇబ్బందులు
author img

By

Published : Nov 3, 2020, 11:41 AM IST

నిజాం కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా చలానా తీసుకునేందుకు ఒకే క్యాష్​ కౌంటర్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్​లో చలానా తీసుకునేందుకు విద్యార్థులు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాం కళాశాల ప్రిన్సిపల్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ బషీర్​బాగ్​లోని నిజాం కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది.

ఈ విషయమై బ్యాంక్ అధికారులను సంప్రదించగా... తగినంత సిబ్బంది లేక ఒకే కౌంటర్ ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. అక్టోబర్ 31న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనెల 5 వరకు కొనసాగనుంది.

నిజాం కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా చలానా తీసుకునేందుకు ఒకే క్యాష్​ కౌంటర్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్​లో చలానా తీసుకునేందుకు విద్యార్థులు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాం కళాశాల ప్రిన్సిపల్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ బషీర్​బాగ్​లోని నిజాం కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది.

ఈ విషయమై బ్యాంక్ అధికారులను సంప్రదించగా... తగినంత సిబ్బంది లేక ఒకే కౌంటర్ ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. అక్టోబర్ 31న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనెల 5 వరకు కొనసాగనుంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.