ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన ప్రజలు బేఖాతరు చేస్తున్నారని పోలీసులు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా హైటెక్ సిటీ చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించారు. అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారుల వాహనాలు సిజ్ చేశారు. ప్రజలు నిత్యావసర సరుకులు, మేడికల్ పరమైన సమస్యలు ఉంటే తప్ప బయటకు రాకూడదని సజ్జనార్ హెచ్చరించారు.
అలాగే హైదరాబాద్ హిమాయత్ నగర కూడలి వద్ద వాహనదారులకు కరోన వైరస్పై నారాయణ గూడ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండాలంటే బయట తిరగొద్దంటూ విజ్ఞప్తి చేశారు. దేశాన్ని.. మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే... ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్