ETV Bharat / state

మెసేజ్​లు పంపి 3.85లక్షల రూపాయలు స్వాహా..!

author img

By

Published : Jul 17, 2020, 4:17 PM IST

మీ ఖాతాలోంచి డబ్బులేమైనా డ్రా చేశారా... అని పలుమార్లు ఎస్ఎంఎస్​లు పంపించి 3.85 లక్షలు దోచేసిన సంఘటన హైదరాబాద్​లో జరిగింది.

cyber cheating in hyderabad
మెసేజ్​లు పంపి 3.85 లక్షల దోపిడీ

హైదరాబాద్ లక్డీకాపూల్​కు చెందిన రజనీ నగేష్​కు బ్యాంకులో ఖాతా ఉంది. రెండు నెలల క్రితమే ఇంటర్​నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకుంది. అయితే నెల రోజులుగా ఆమెకు మీ ఖాతా డబ్బులు ఏమైనా డ్రా చేశారా అంటూ అలర్ట్ మెసేజ్​లు వస్తున్నాయి. ఒకవేళ మీరు డబ్బులు డ్రా చేయని పక్షంలో 15151 నంబర్​కు ఎ​స్​ఎంఎస్​ చేయాలని కోరతారు.

అది చూసిన ఆమె పలుమార్లు మెసేజ్​ చేసింది. ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అని వచ్చింది. అయితే ఒక్కసారిగా ఆమె ఖాతాలో 3.85 లక్షలు డ్రా అయిపోయాయి. ఎలా జరిగిందో తెలియక బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లక్డీకాపూల్​కు చెందిన రజనీ నగేష్​కు బ్యాంకులో ఖాతా ఉంది. రెండు నెలల క్రితమే ఇంటర్​నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకుంది. అయితే నెల రోజులుగా ఆమెకు మీ ఖాతా డబ్బులు ఏమైనా డ్రా చేశారా అంటూ అలర్ట్ మెసేజ్​లు వస్తున్నాయి. ఒకవేళ మీరు డబ్బులు డ్రా చేయని పక్షంలో 15151 నంబర్​కు ఎ​స్​ఎంఎస్​ చేయాలని కోరతారు.

అది చూసిన ఆమె పలుమార్లు మెసేజ్​ చేసింది. ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అని వచ్చింది. అయితే ఒక్కసారిగా ఆమె ఖాతాలో 3.85 లక్షలు డ్రా అయిపోయాయి. ఎలా జరిగిందో తెలియక బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్‌ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.