ETV Bharat / state

క్షేత్రస్థాయి కసరత్తులకై కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు - CS_Video_Conference_with_Collectors

హైదరాబాద్​ సచివాలయంలో కలెక్టర్​లతో సీఎస్ ఎస్కే జోషి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పలు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల పాల్గొన్న ఈ సమావేశంలో... వివిధ అంశాలపై సమీక్షించారు. పలు సూచనలతో పాటు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.​

CS_Video_Conference_with_Collectors
author img

By

Published : Jul 30, 2019, 11:17 PM IST

క్షేత్రస్థాయి కసరత్తులకై కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు
గ్రామాలు, రైతుల వారీగా పంటసాగు వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు ట్యాబ్​ల ద్వారా ప్రతిరోజూ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏఈఓల పనితీరుని పర్యవేక్షించాలన్నారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వానలతో వర్షాధార పంటలు 99 శాతం మేరకు సాగయ్యాయని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి తెలిపారు. ప్రధాన ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరొస్తే వరి పంట సాగు పెరుగుతుందన్నారు. రైతులు, పంటల వారీగా ప్రతి సీజన్​లో వివరాల సేకరణ వల్ల కనీస మద్దతు ధర అమలు, చెల్లింపులు సులభమవుతాయన్నారు.

జనగణనకై కసరత్తు...

2021 జనాభా లెక్కలకు సంబంధించి గ్రామ, పట్టణ రిజిస్ట్రార్​లు ఆయా ప్రాంతాల వివరాలు పంపాలని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా ఆదేశించారు. వరంగల్ అర్బన్, మహబూబ్​నగర్, నిజామాబాద్ జిల్లాలో జనాభా లెక్కల ముందస్తు పరీక్ష కోసం ఎన్యుమరేటర్ల ఎంపిక, శిక్షణను పూర్తి చేయాలన్నారు. ఇళ్ల వారీగా జాబితాలు, పరిశీలన చేయాలని సూచించారు. జనగణన శాఖ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్​ను ఉపయోగించుకోవాలన్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తుందని... గిరిజన ప్రాంతాల్లో ఉన్న 109 షాపులకు సంబంధించి 15 రోజుల్లోగా గ్రామసభ తీర్మాణాలు సేకరించాలని కలెక్టర్లను కోరారు.

ఆగస్టు 15 నాటికి 100 శాతం మరుగుదొడ్లు...

ఆగస్టు 15 నాటికి జిల్లాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు. బహిర్భూమిరహితంగా ప్రకటించే ముందు జియోట్యాగింగ్ చేయాలన్నారు. రూర్బన్​పై ప్రత్యేకంగా సమీక్షించి భూకేటాయింపులు పూర్తి చేసి మౌళికవసతుల పనులు చేపట్టాలని సూచించారు.

బ్లాక్​స్పాట్స్​ గుర్తించి మరమ్మతులు...

గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమాచారాన్ని ఈ-పంచాయత్ సాఫ్ట్​వేర్​లో పొందుపర్చాలని... ఈ విషయమై జిల్లాపంచాయతీ అధికారులతో కలెక్టర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని వికాస్​రాజ్ స్పష్టం చేశారు. జిల్లా రహదారి భద్రతా కమిటి సమావేశాలు నిర్వహించి మినిట్స్ పంపాలన్న ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ... రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అధికారులతో కూడిన కమిటీలను ప్రమాద స్థలాల వద్దకు పంపి పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. రహదార్లపై బ్లాక్​స్పాట్స్​ను గుర్తించి తగు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ

క్షేత్రస్థాయి కసరత్తులకై కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు
గ్రామాలు, రైతుల వారీగా పంటసాగు వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు ట్యాబ్​ల ద్వారా ప్రతిరోజూ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏఈఓల పనితీరుని పర్యవేక్షించాలన్నారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వానలతో వర్షాధార పంటలు 99 శాతం మేరకు సాగయ్యాయని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి తెలిపారు. ప్రధాన ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరొస్తే వరి పంట సాగు పెరుగుతుందన్నారు. రైతులు, పంటల వారీగా ప్రతి సీజన్​లో వివరాల సేకరణ వల్ల కనీస మద్దతు ధర అమలు, చెల్లింపులు సులభమవుతాయన్నారు.

జనగణనకై కసరత్తు...

2021 జనాభా లెక్కలకు సంబంధించి గ్రామ, పట్టణ రిజిస్ట్రార్​లు ఆయా ప్రాంతాల వివరాలు పంపాలని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా ఆదేశించారు. వరంగల్ అర్బన్, మహబూబ్​నగర్, నిజామాబాద్ జిల్లాలో జనాభా లెక్కల ముందస్తు పరీక్ష కోసం ఎన్యుమరేటర్ల ఎంపిక, శిక్షణను పూర్తి చేయాలన్నారు. ఇళ్ల వారీగా జాబితాలు, పరిశీలన చేయాలని సూచించారు. జనగణన శాఖ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్​ను ఉపయోగించుకోవాలన్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తుందని... గిరిజన ప్రాంతాల్లో ఉన్న 109 షాపులకు సంబంధించి 15 రోజుల్లోగా గ్రామసభ తీర్మాణాలు సేకరించాలని కలెక్టర్లను కోరారు.

ఆగస్టు 15 నాటికి 100 శాతం మరుగుదొడ్లు...

ఆగస్టు 15 నాటికి జిల్లాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు. బహిర్భూమిరహితంగా ప్రకటించే ముందు జియోట్యాగింగ్ చేయాలన్నారు. రూర్బన్​పై ప్రత్యేకంగా సమీక్షించి భూకేటాయింపులు పూర్తి చేసి మౌళికవసతుల పనులు చేపట్టాలని సూచించారు.

బ్లాక్​స్పాట్స్​ గుర్తించి మరమ్మతులు...

గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమాచారాన్ని ఈ-పంచాయత్ సాఫ్ట్​వేర్​లో పొందుపర్చాలని... ఈ విషయమై జిల్లాపంచాయతీ అధికారులతో కలెక్టర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని వికాస్​రాజ్ స్పష్టం చేశారు. జిల్లా రహదారి భద్రతా కమిటి సమావేశాలు నిర్వహించి మినిట్స్ పంపాలన్న ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ... రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అధికారులతో కూడిన కమిటీలను ప్రమాద స్థలాల వద్దకు పంపి పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. రహదార్లపై బ్లాక్​స్పాట్స్​ను గుర్తించి తగు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.