ETV Bharat / state

ముసుగులు తొలగించి రాజకీయాల్లోకి నేరగాళ్లు

author img

By

Published : Sep 20, 2020, 4:59 AM IST

నేరమయ రాజకీయాలు ఒకప్పుడు ఈమాట వినడానికి ఆశ్చర్యం కలిగి ఉండవచ్చేమోగానీ... ఇప్పుడు అది సాధారణం అయిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేరం, రాజకీయం కలగలిసి పోయాయి. ఒకప్పుడు తెరవెనుక ఉండి చక్రం తిప్పిన నేరగాళ్లు.. ముసుగులు తొలగించుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి నేరగాళ్లను ప్రవేశించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అనేక నివేదికలు, ఈసీ నిబంధనలు, కోర్టు తీర్పులు కూడా వెలువడ్డాయి. కనీసం వారిపై నమోదైన కేసులైనా త్వరగా పరిష్కారం అవుతాయా అంటే అందుకు చొరవ కనపడలేదు. దీంతో మరోసారి న్యాయపాలికే కొరడా ఝళిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముసుగులు తొలగించి రాజకీయాల్లోకి నేరగాళ్లు
ముసుగులు తొలగించి రాజకీయాల్లోకి నేరగాళ్లు
ముసుగులు తొలగించి రాజకీయాల్లోకి నేరగాళ్లు

ప్రస్తుతం రాజకీయాల్లోకి నేరస్తుల అరంగేట్రం సాధారణంగా మారింది. ఎన్నో రకాల నేరాలు చేసినవారు చివరకు హత్యారోపణలు ఉన్న వారు సైతం ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి అడుగు పెడుతుంటే.. రాజకీయాలు, నేరాలు కలగలసిపోయిన ఓ వికృతదృశ్యం కనిపిస్తోంది. చేతులకున్న బేడీలు ఆభరణాలుగా.. తమపై ఉన్న కేసులను ప్రతిష్ఠగా భావిస్తూ దర్జాగా.. చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు ఉండే ప్రత్యేక హక్కులను అనుభవిస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేరస్తులెవరో అసలైన నిజాయితీపరులు ఎవరో వేరుచేసి చూడలేకపోతున్నాం.

సామాన్యుల విషయంలోనే..

చట్టం తన పనితాను చేసుకుంటూ.. పోతుందని ప్రతి ఒక్కరు చెబుతున్నా.. అది సామాన్యుల విషయంలోనే నిజమవుతోంది. పలుకుబడి గల బడానేతలు మాత్రం చట్టం కళ్లుగప్పుతున్నారు. ఏదైనా ఆరోపణలొస్తే కింది కోర్టు.. పైకోర్టు, ఆ పైన పైకోర్టుల్లో అప్పీళ్లతో నేరస్తులు తప్పించుకుంటూనే ఉన్నారు. ఫలితంగా చట్టబద్ధపాలన అనేది పుస్తకాల్లో మాత్రమే భద్రంగా ఉంటోంది. రాజ్యాంగ స్ఫూర్తి అమలుకావడం లేదు. అధికారం శాశ్వతం కాదని నేతలకు తెలుసు కాబట్టే తర్వాత రోజుల్లోనూ తమపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చి జైలు పాలైతే ఆ అంశాన్నీ అనుకూలంగా మలచుకుంటున్నారు కొందరు. అంతేకానీ జైలుకు వెళ్లివచ్చినందుకు ఏమాత్రం పశ్చాత్తాపం ప్రదర్శించడం లేదు.

అల్లకల్లోలం..

శాసనకర్తలపై వస్తున్న ఆరోపణలపై మూడేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు. ప్రజలకు బాధ్యులుగా ఉండే వ్యక్తులు నేరాలకు పాల్పడితే మొత్తం వ్యవస్థ అల్లకల్లోలం అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. ఏడాదిలోగా విచారణ పూర్తి కావాలంటే ప్రత్యేక కోర్టులే శరణ్యమని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాల ప్రకారం రెండేళ్ల క్రితం ఫాస్ట్‌ కోర్టులు ఏర్పాటైనా కేసుల పరిష్కారం మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉండటం ఆలోచించాల్సిన విషయం.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న తపన..

నేరగ్రస్త రాజకీయాలనుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న తపన సుప్రీం ఆదేశాల్లో ఎప్పటికప్పుడు కనిపిస్తునే ఉన్నాయి. కాని 2 దశాబ్దాలకు పైగా ఆ చొరవ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడంలేదు. నేరచరితులైన నేతలపై గల కేసుల సత్వర విచారణకు 2018లో 12 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్ని సిద్ధం చేసినా ఏడాదిలోగా తుదితీర్పులు వెలువడాలన్న లక్ష్యానికి తూట్లు పడ్డాయి. ఆ పరిస్థితిని ఇక ఉపేక్షించరాదన్న సంకల్పంతో రాజకీయనేతలపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ వేగవంతం చేసేలా వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పంపాలని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సుప్రీం ధర్మాసనం తాజాగా ఆదేశించింది.

రోజువారీ విచారణ..

స్టే ఉత్తర్వులు ఉన్న కేసులనూ రోజువారీ విచారణ జరిపి 2 నెలల్లో తేల్చేయాలంది సుప్రీం కోర్టు. 4 వేలమందికి పైనే ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ ఉండటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆవేదన వ్యక్తపరిచింది. ఇందులో కొన్నికేసులు 1980 నుంచి పెండింగ్‌లో ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం. క్రిమినల్ కేసుల్లో నేరస్తులుగా రుజువైన వారు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నేతల సంఖ్య పెరిగిపోవడం, విచారణ లో ఉన్న కేసులను బలసంపన్నులైన ప్రజాప్రతినిధులు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం.

24 హైకోర్టులకు ఉత్తర్వులు..

ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలు అందించాలని ఈ ఏడాది మార్చిలో 24 హైకోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీం కోర్టు. దీనిపై వివరాలు సేకరించిన కోర్టు సహాయకుడు హన్సారియా అందించిన నివేదిక ప్రకారం దాదాపు 4వేల442 మందిపై క్రిమినల్‌ కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2018లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. 4,442లో 2,556 మంది ప్రస్తుత ప్రజాప్రతినిధులే కావడం ఆలోచించాల్సిన అంశం. ఇందులో దాదాపు 352 కేసుల్లో విచారణపై స్టే ఇవ్వడం జరిగింది.

సాగుతోన్న విచారణ..

ఈ కేసుల్లో 1981లో 1983లో నమోదైనవి ఉన్నాయి. ఇందులో ఒకదాంట్లో ఇంకా అభియోగాలే నమోదు కాకపోగా మరొక దానిలో విచారణ సాగుతోంది. పశ్చిమబంగలో నమోదైన వాటిలో 131 కేసుల్లో ఇంకా అభియోగాలు నమోదు కాలేదు. ఇందులో 101 మంది ప్రస్తుత ప్రజా ప్రతినిధులే ఉన్నారు. దేశంలో ఎక్కుమంది నేరచరిత ఉన్న ప్రజాప్రతినిధులతో ఉత్తరప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ1,217మందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ 1991, 93, 94లో నమోదైనవే . బిహార్‌లో 531మందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేరళలో 333 రాజకీయ నేతలపై కేసులు ఉన్నాయి. వీరిలో 310 మంది ప్రస్తుత ప్రజా ప్రతినిధులే ఉన్నారు. రాజకీయ నేతలపై కేసులు విచారించేందుకు ఏర్పాటు చేసిన 12 ప్రత్యేక కోర్టులు ఏపీ , బిహార్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తమిళ నాడు, తెలంగాణ, యూపీ, పశ్చిమబంగ, దిల్లీలో ఉన్నాయి.

పెద్ద ఎత్తున కేసులు..

2014 సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున కేసులు ఉన్నట్లు తేలింది. ఇందులో ఎక్కువశాతం తీవ్రమైన హత్య, కిడ్నాప్, దొంగతనం, అత్యాచారం లాంటివే ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. 774 మంది ఎంపీలు.. 4,078 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను నిశితంగా పరిశీలించగా.. 1,581 మంది ఏదో నేరం చేసి కేసులు ఎదుర్కొన్నవారే. వీరిలో 334 మంది మహిళలపై నేరాలు చేశారని వెల్లడయింది. ఓ రకంగా ఈ గణాంకాలన్నీ మన రాజకీయ వ్యవస్థ దుస్థితి చెప్పకనే చెబుతున్నాయి. నేరమయ రాజకీయాలు దేశంలో ఏస్థాయిలో చెలామణి అవుతున్నాయో కళ్లకు కడుతున్నాయి.

అనర్హుల్ని చేసినంత మాత్రానా?

నేరచరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులను అనర్హుల్ని చేసినంత మాత్రానే నేర రాజకీయాల దూకుడును అరికట్టలేమని, దానికి తోడు రాజకీయ పక్షాల ప్రక్షాళనా మొదలుకావాలని ఇటీవలే సుప్రీంకోర్టు ప్రస్తావించింది. నేరచరితుల్నే అభ్యర్ధులుగా ఎందుకు నిలబెట్టాల్సి వచ్చిందో పార్టీలు స్పష్టం చేయాల్సిందేనంటూ అప్పట్లో ఆదేశాలు కూడా వెలువరించింది. నేర చరితులకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అక్రమార్జనపరులు సులభంగా నెగ్గుకొస్తున్నారనీ గతంలో సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది కూడా.

చేరదీయకుంటే..

నేరచరిత్ర ఉన్న వారిని పార్టీలు చేరదీయకుంటే చాలావరకు సంక్షోభం సమసిపోగల అవకాశాలున్నాయి. కాని అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు నేరస్తులు తామే సొంతంగా పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. అన్ని రకాల అవినీతికి తల్లివేరు రాజకీయ అవినీతి. సమస్త పాలన వ్యవస్థల్నీ అవినీతికూపంలా మార్చేసిన ఆ దుస్థితికి మళ్లీ రాకుండా చేయాలంటే జనంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.

ఇదీ చూడండి: చైనాలాగే పాక్​తోనూ చర్చలు జరపాలి: ఫరూక్​

ముసుగులు తొలగించి రాజకీయాల్లోకి నేరగాళ్లు

ప్రస్తుతం రాజకీయాల్లోకి నేరస్తుల అరంగేట్రం సాధారణంగా మారింది. ఎన్నో రకాల నేరాలు చేసినవారు చివరకు హత్యారోపణలు ఉన్న వారు సైతం ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి అడుగు పెడుతుంటే.. రాజకీయాలు, నేరాలు కలగలసిపోయిన ఓ వికృతదృశ్యం కనిపిస్తోంది. చేతులకున్న బేడీలు ఆభరణాలుగా.. తమపై ఉన్న కేసులను ప్రతిష్ఠగా భావిస్తూ దర్జాగా.. చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు ఉండే ప్రత్యేక హక్కులను అనుభవిస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేరస్తులెవరో అసలైన నిజాయితీపరులు ఎవరో వేరుచేసి చూడలేకపోతున్నాం.

సామాన్యుల విషయంలోనే..

చట్టం తన పనితాను చేసుకుంటూ.. పోతుందని ప్రతి ఒక్కరు చెబుతున్నా.. అది సామాన్యుల విషయంలోనే నిజమవుతోంది. పలుకుబడి గల బడానేతలు మాత్రం చట్టం కళ్లుగప్పుతున్నారు. ఏదైనా ఆరోపణలొస్తే కింది కోర్టు.. పైకోర్టు, ఆ పైన పైకోర్టుల్లో అప్పీళ్లతో నేరస్తులు తప్పించుకుంటూనే ఉన్నారు. ఫలితంగా చట్టబద్ధపాలన అనేది పుస్తకాల్లో మాత్రమే భద్రంగా ఉంటోంది. రాజ్యాంగ స్ఫూర్తి అమలుకావడం లేదు. అధికారం శాశ్వతం కాదని నేతలకు తెలుసు కాబట్టే తర్వాత రోజుల్లోనూ తమపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చి జైలు పాలైతే ఆ అంశాన్నీ అనుకూలంగా మలచుకుంటున్నారు కొందరు. అంతేకానీ జైలుకు వెళ్లివచ్చినందుకు ఏమాత్రం పశ్చాత్తాపం ప్రదర్శించడం లేదు.

అల్లకల్లోలం..

శాసనకర్తలపై వస్తున్న ఆరోపణలపై మూడేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు. ప్రజలకు బాధ్యులుగా ఉండే వ్యక్తులు నేరాలకు పాల్పడితే మొత్తం వ్యవస్థ అల్లకల్లోలం అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. ఏడాదిలోగా విచారణ పూర్తి కావాలంటే ప్రత్యేక కోర్టులే శరణ్యమని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాల ప్రకారం రెండేళ్ల క్రితం ఫాస్ట్‌ కోర్టులు ఏర్పాటైనా కేసుల పరిష్కారం మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉండటం ఆలోచించాల్సిన విషయం.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న తపన..

నేరగ్రస్త రాజకీయాలనుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న తపన సుప్రీం ఆదేశాల్లో ఎప్పటికప్పుడు కనిపిస్తునే ఉన్నాయి. కాని 2 దశాబ్దాలకు పైగా ఆ చొరవ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడంలేదు. నేరచరితులైన నేతలపై గల కేసుల సత్వర విచారణకు 2018లో 12 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్ని సిద్ధం చేసినా ఏడాదిలోగా తుదితీర్పులు వెలువడాలన్న లక్ష్యానికి తూట్లు పడ్డాయి. ఆ పరిస్థితిని ఇక ఉపేక్షించరాదన్న సంకల్పంతో రాజకీయనేతలపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ వేగవంతం చేసేలా వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పంపాలని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సుప్రీం ధర్మాసనం తాజాగా ఆదేశించింది.

రోజువారీ విచారణ..

స్టే ఉత్తర్వులు ఉన్న కేసులనూ రోజువారీ విచారణ జరిపి 2 నెలల్లో తేల్చేయాలంది సుప్రీం కోర్టు. 4 వేలమందికి పైనే ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ ఉండటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆవేదన వ్యక్తపరిచింది. ఇందులో కొన్నికేసులు 1980 నుంచి పెండింగ్‌లో ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం. క్రిమినల్ కేసుల్లో నేరస్తులుగా రుజువైన వారు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నేతల సంఖ్య పెరిగిపోవడం, విచారణ లో ఉన్న కేసులను బలసంపన్నులైన ప్రజాప్రతినిధులు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం.

24 హైకోర్టులకు ఉత్తర్వులు..

ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలు అందించాలని ఈ ఏడాది మార్చిలో 24 హైకోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీం కోర్టు. దీనిపై వివరాలు సేకరించిన కోర్టు సహాయకుడు హన్సారియా అందించిన నివేదిక ప్రకారం దాదాపు 4వేల442 మందిపై క్రిమినల్‌ కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2018లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. 4,442లో 2,556 మంది ప్రస్తుత ప్రజాప్రతినిధులే కావడం ఆలోచించాల్సిన అంశం. ఇందులో దాదాపు 352 కేసుల్లో విచారణపై స్టే ఇవ్వడం జరిగింది.

సాగుతోన్న విచారణ..

ఈ కేసుల్లో 1981లో 1983లో నమోదైనవి ఉన్నాయి. ఇందులో ఒకదాంట్లో ఇంకా అభియోగాలే నమోదు కాకపోగా మరొక దానిలో విచారణ సాగుతోంది. పశ్చిమబంగలో నమోదైన వాటిలో 131 కేసుల్లో ఇంకా అభియోగాలు నమోదు కాలేదు. ఇందులో 101 మంది ప్రస్తుత ప్రజా ప్రతినిధులే ఉన్నారు. దేశంలో ఎక్కుమంది నేరచరిత ఉన్న ప్రజాప్రతినిధులతో ఉత్తరప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ1,217మందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ 1991, 93, 94లో నమోదైనవే . బిహార్‌లో 531మందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేరళలో 333 రాజకీయ నేతలపై కేసులు ఉన్నాయి. వీరిలో 310 మంది ప్రస్తుత ప్రజా ప్రతినిధులే ఉన్నారు. రాజకీయ నేతలపై కేసులు విచారించేందుకు ఏర్పాటు చేసిన 12 ప్రత్యేక కోర్టులు ఏపీ , బిహార్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తమిళ నాడు, తెలంగాణ, యూపీ, పశ్చిమబంగ, దిల్లీలో ఉన్నాయి.

పెద్ద ఎత్తున కేసులు..

2014 సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున కేసులు ఉన్నట్లు తేలింది. ఇందులో ఎక్కువశాతం తీవ్రమైన హత్య, కిడ్నాప్, దొంగతనం, అత్యాచారం లాంటివే ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. 774 మంది ఎంపీలు.. 4,078 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను నిశితంగా పరిశీలించగా.. 1,581 మంది ఏదో నేరం చేసి కేసులు ఎదుర్కొన్నవారే. వీరిలో 334 మంది మహిళలపై నేరాలు చేశారని వెల్లడయింది. ఓ రకంగా ఈ గణాంకాలన్నీ మన రాజకీయ వ్యవస్థ దుస్థితి చెప్పకనే చెబుతున్నాయి. నేరమయ రాజకీయాలు దేశంలో ఏస్థాయిలో చెలామణి అవుతున్నాయో కళ్లకు కడుతున్నాయి.

అనర్హుల్ని చేసినంత మాత్రానా?

నేరచరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులను అనర్హుల్ని చేసినంత మాత్రానే నేర రాజకీయాల దూకుడును అరికట్టలేమని, దానికి తోడు రాజకీయ పక్షాల ప్రక్షాళనా మొదలుకావాలని ఇటీవలే సుప్రీంకోర్టు ప్రస్తావించింది. నేరచరితుల్నే అభ్యర్ధులుగా ఎందుకు నిలబెట్టాల్సి వచ్చిందో పార్టీలు స్పష్టం చేయాల్సిందేనంటూ అప్పట్లో ఆదేశాలు కూడా వెలువరించింది. నేర చరితులకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అక్రమార్జనపరులు సులభంగా నెగ్గుకొస్తున్నారనీ గతంలో సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది కూడా.

చేరదీయకుంటే..

నేరచరిత్ర ఉన్న వారిని పార్టీలు చేరదీయకుంటే చాలావరకు సంక్షోభం సమసిపోగల అవకాశాలున్నాయి. కాని అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు నేరస్తులు తామే సొంతంగా పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. అన్ని రకాల అవినీతికి తల్లివేరు రాజకీయ అవినీతి. సమస్త పాలన వ్యవస్థల్నీ అవినీతికూపంలా మార్చేసిన ఆ దుస్థితికి మళ్లీ రాకుండా చేయాలంటే జనంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.

ఇదీ చూడండి: చైనాలాగే పాక్​తోనూ చర్చలు జరపాలి: ఫరూక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.