ETV Bharat / state

'బీబీనగర్​ ఎయిమ్స్​ను కొవిడ్​ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించాలి'

author img

By

Published : May 13, 2021, 5:59 PM IST

బీబీనగర్‌ ఎయిమ్స్‌ను కొవిడ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించాలని కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డికి... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. అన్ని సౌకర్యాలున్న ఎయిమ్స్‌ను కొవిడ్​ చికిత్సకు ఉపయోగించుకోకుండా జాప్యం చేస్తే... మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

తెలంగాణ వార్తలు
బీబీనగర్​ ఎయిమ్స్​పై లేఖ

అన్ని వసతులు ఉన్న బీబీనగర్​ ఎయిమ్స్​ ఆస్పత్రిని కొవిడ్​ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల కాలంలో కిషన్​రెడ్డి ఎయిమ్స్​ను సందర్శించిన సందర్భంగా కొవిడ్​పై ఏదొక నిర్ణయం తీసుకుంటారని ప్రజలంతా ఎదురు చూశారని... కాని అలాంటిదేమీ జరగలేదన్నారు. ఎయిమ్స్‌లో విశాలమైన భవనాలతో పాటు 180 మందికి పైగా వైద్యులు, సిబ్బంది ఉన్నారన్నారు. సీసీఎంబీ ఆక్సిజన్‌ ప్లాంట్‌ అనుమతిపై కూడా సానుకూలంగా ఉందన్నారు. ఇన్ని వసతులు ఉన్న ఈ వైద్యశాలను ఉపయోగించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాలని రాష్ట్ర, జిల్లా యంత్రాంగం చెబుతోందని కిషన్‌ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు.

ఎయిమ్స్‌ను కొవిడ్​ చికిత్సకు ఉపయోగించుకోకుండా జాప్యం చేస్తే మరణాలకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పది పదిహేను రోజుల్లో ఆక్సిజన్​ ప్లాంటును ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు కావాల్సిన బెడ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లను తక్షణం ఏర్పాటు చేయాలని.. అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు.

అన్ని వసతులు ఉన్న బీబీనగర్​ ఎయిమ్స్​ ఆస్పత్రిని కొవిడ్​ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల కాలంలో కిషన్​రెడ్డి ఎయిమ్స్​ను సందర్శించిన సందర్భంగా కొవిడ్​పై ఏదొక నిర్ణయం తీసుకుంటారని ప్రజలంతా ఎదురు చూశారని... కాని అలాంటిదేమీ జరగలేదన్నారు. ఎయిమ్స్‌లో విశాలమైన భవనాలతో పాటు 180 మందికి పైగా వైద్యులు, సిబ్బంది ఉన్నారన్నారు. సీసీఎంబీ ఆక్సిజన్‌ ప్లాంట్‌ అనుమతిపై కూడా సానుకూలంగా ఉందన్నారు. ఇన్ని వసతులు ఉన్న ఈ వైద్యశాలను ఉపయోగించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాలని రాష్ట్ర, జిల్లా యంత్రాంగం చెబుతోందని కిషన్‌ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు.

ఎయిమ్స్‌ను కొవిడ్​ చికిత్సకు ఉపయోగించుకోకుండా జాప్యం చేస్తే మరణాలకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పది పదిహేను రోజుల్లో ఆక్సిజన్​ ప్లాంటును ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు కావాల్సిన బెడ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లను తక్షణం ఏర్పాటు చేయాలని.. అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్, జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.