ప్రజా సమస్యలు కొలిక్కి వచ్చే వరకు పోరాడే గొప్ప వ్యక్తి అచ్యుత రావు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొనియాడారు. ఆయన కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి చనిపోవడం తీరని లోటని తెలిపారు.
సీపీఐ ఆధ్వర్యంలో బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు అచ్యుతరావు సంతాప సభను జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సంతాప సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, సుధాకర్, పార్టీ శ్రేణులు పాల్గొని నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?