ETV Bharat / state

ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించిన సీపీ మహేశ్​

author img

By

Published : May 18, 2021, 7:50 PM IST

హైదరాబాద్ ఉప్పల్‌లోని అభిసాయి చిన్నారుల సంరక్షణ కేంద్రంలో ఉచిత భోజన పథకాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్ ప్రారంభించారు. ప్రతిరోజు ఈ కేంద్రంలో చిన్నారులకు హరియణా నాగరిక్ సమాజ్‌ నిర్వాహకులు భోజనం ఉచితంగా అందజేస్తారని తెలిపారు.

food distribution
food distribution

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లల సంరక్షణ కేంద్రాల్లోని చిన్నారులు పడుతున్న ఇబ్బందులు చూసి... ఓ స్వచ్ఛంద సంస్థ వారికి భోజన వసతి కల్పించడానికి ముందుకొచ్చింది. రాచకొండ పోలీసులు హరియణా నాగరిక్​ సమాజం సంయుక్తంగా స్వస్త సేవా పేరిట చిన్నారులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.

ఉప్పల్‌లోని అభిసాయి చిన్నారుల సంరక్షణ కేంద్రంలో ఉచిత భోజన పథకాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్ ప్రారంభించారు. ప్రతిరోజు ఈ కేంద్రంలో చిన్నారులకు హరియణా నాగరిక్ సమాజ్‌ నిర్వాహకులు భోజనం ఉచితంగా అందజేస్తారని సీపీ మహేశ్​ భగవత్ తెలిపారు. సమాజ్ ప్రతినిధులు కేంద్రానికి 5 కంప్యూటర్లు, తాగునీటి కూలర్లు అందజేశారు. అవసరమైనవారు తమను సంప్రదిస్తే సహాయం చేస్తామని హరియణా నాగరిక్ సమాజ్ అధ్యక్షుడు అంజనీ అగర్వాల్ తెలిపారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లల సంరక్షణ కేంద్రాల్లోని చిన్నారులు పడుతున్న ఇబ్బందులు చూసి... ఓ స్వచ్ఛంద సంస్థ వారికి భోజన వసతి కల్పించడానికి ముందుకొచ్చింది. రాచకొండ పోలీసులు హరియణా నాగరిక్​ సమాజం సంయుక్తంగా స్వస్త సేవా పేరిట చిన్నారులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.

ఉప్పల్‌లోని అభిసాయి చిన్నారుల సంరక్షణ కేంద్రంలో ఉచిత భోజన పథకాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్ ప్రారంభించారు. ప్రతిరోజు ఈ కేంద్రంలో చిన్నారులకు హరియణా నాగరిక్ సమాజ్‌ నిర్వాహకులు భోజనం ఉచితంగా అందజేస్తారని సీపీ మహేశ్​ భగవత్ తెలిపారు. సమాజ్ ప్రతినిధులు కేంద్రానికి 5 కంప్యూటర్లు, తాగునీటి కూలర్లు అందజేశారు. అవసరమైనవారు తమను సంప్రదిస్తే సహాయం చేస్తామని హరియణా నాగరిక్ సమాజ్ అధ్యక్షుడు అంజనీ అగర్వాల్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.