ETV Bharat / state

నిమజ్జనాలకు సిద్ధమైన సరూర్‌నగర్ చెరువు

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై రాచకొండ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్వర్యంలో సరూర్‌నగర్‌ కట్టపై సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ తెలిపారు.

author img

By

Published : Sep 3, 2019, 5:50 PM IST

నిమజ్జనలకు సిద్ధమైన సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై రాచకొండ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్వర్యంలో సరూర్‌నగర్‌ కట్టపై సమావేశం నిర్వహించారు. అందరి భాగస్వామ్యంతో వినాయక నిమజ్జనాలను ఘనంగా నిర్వహిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనం కోసం 8 క్రేన్‌లను సిద్దంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు సిద్ధం చేశామన్నారు. నిఘా కోసం 200సీసీ కెమెరాలను అమర్చామని, మూడు మొబైల్ సీసీ కెమెరాల వాహనాలు కూడా గస్తీలో ఉంచామని మహేష్ భగవత్ వివరించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, జీహెచ్‌ఎంసీ ఈస్ట్‌జోన్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నిమజ్జనాలకు సిద్ధమైన సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌

ఇదీ చూడండి :భక్తుల మొర ఆలకిస్తున్న బాలాపూర్ గణపతి

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై రాచకొండ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్వర్యంలో సరూర్‌నగర్‌ కట్టపై సమావేశం నిర్వహించారు. అందరి భాగస్వామ్యంతో వినాయక నిమజ్జనాలను ఘనంగా నిర్వహిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనం కోసం 8 క్రేన్‌లను సిద్దంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు సిద్ధం చేశామన్నారు. నిఘా కోసం 200సీసీ కెమెరాలను అమర్చామని, మూడు మొబైల్ సీసీ కెమెరాల వాహనాలు కూడా గస్తీలో ఉంచామని మహేష్ భగవత్ వివరించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, జీహెచ్‌ఎంసీ ఈస్ట్‌జోన్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నిమజ్జనాలకు సిద్ధమైన సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌

ఇదీ చూడండి :భక్తుల మొర ఆలకిస్తున్న బాలాపూర్ గణపతి

Intro:హైదరాబాద్ రానున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై జిహెచ్ఎంసి రాచకొండ పోలీసులు మరియు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లో సరూర్ నగర్ ,మినీ ట్యాంక్ బండ్ కసంయుక్త సమావేశం నిర్వహించారు.


Body:ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు జిహెచ్ఎంసి ఈస్ట్ జోన్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్ బి నగర్ డిసిపి సన్ ప్రీత్ సింగ్ ,జిహెచ్ఎంసి సర్కిల్ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు,
గణేష్ నిమజ్జనం రోజు మొదలుకొని ముగింపు వరకు నిమజ్జనం కొరకు వచ్చేవారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయమని నిమజ్జనం కొరకు 8 క్రేన్లను ఏర్పాటు చేశామని వచ్చే భక్తులకు పార్కింగ్ విషయంలో కానీ మంచి నీరు నిరంతరం విద్యుత్ సరఫరా కొరకు జనరేటర్లు ఆరోగ్య సమస్యలను అందుబాటులో అందుకు వీలుగా చర్యలు చేపట్టామని, అను నిత్య నిఘా ఏర్పాటు కొరకు సుమారు 200 సీసీ కెమెరాలను అమర్చడం 3 మొబైల్ సీసీ కెమెరాలు వాహనాలు కూడా గస్తీ తిరుగుతున్నాయని, సుమారు 300 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని గత మూడు సంవత్సరాలుగా ఎలా ప్రశాంతంగా నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి చేశాము అందుకు భిన్నంగా ఇప్పుడు కూడా అందరి భాగస్వామ్యంతో శాంతియుతంగా నిమజ్జనం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, అన్నారు.


Conclusion:పోలీస్ శాఖ మరియు జిహెచ్ఎంసి శాఖ అధికారులు తో సంయుక్తంగా ముందుకు సాగుతామని జి.హెచ్.ఎం.సి ఈస్ట్ జోన్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు రాచ కొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

బైట్: మహేష్ భగవత్ (రాచకొండ పోలీస్ కమిషనర్)
బైట్: శ్రీనివాస్ రెడ్డి ,(జిహెచ్ఎంసి ఈస్ట్ జోన్ కమిషనర్)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.