ETV Bharat / state

dasari narayana rao sons: దాసరి నారాయణరావు ఇంటికి కోర్టు నోటీసులు.. ఏం జరిగింది?

author img

By

Published : Nov 3, 2021, 2:15 PM IST

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా... రూ.2కోట్ల 11లక్షల విషయమై దాసరి కుమారులపై(dasari narayana rao sons) ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నోటీసులు అంటించినట్లు తెలుస్తోంది.

dasari narayana rao sons, notices to dasari narayana rao home
దాసరి నారాయణరావు ఇంటికి కోర్టు నోటీసులు, దాసరి నారాయణ రావు వార్తలు

దివంగత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్‌ కోర్టు నోటిసులు జారీ చేసింది. దాసరి నారాయణరావు కుమారులు(dasari narayana rao sons) దాసరి ప్రభు, దాసరి అరుణ్‌లు వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్‌ నిర్మాణం కోసం రూ.2కోట్ల 11లక్షల తీసుకున్నారని సోమశేఖర్‌రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తిరిగి డబ్బులు చెల్లించంలో వీరిద్దరూ జాప్యం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

dasari narayana rao sons, notices to dasari narayana rao home
దాసరి ఇంటికి నోటీసులు

ఈ పిటిషన్​ను విచారణలోకి తీసుకున్న కోర్టు... దాసరి ప్రభు, దాసరి అరుణ్​లకు ఆర్డర్ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబర్ 46 సీబీఐ కాలనీలోని ఆయన ఇంటికి వచ్చిన కోర్టు సిబ్బంది... నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఈ నెల 15న అనగా రెండు వారాల గడువులోగా ఆ డబ్బును చెల్లించాలని ఆ నోటీసులో ఆదేశించింది.

ఇదీ చదవండి: Naga shaurya farm house case: 'పేకాడదాం రండి'.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన కార్డులు

దివంగత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్‌ కోర్టు నోటిసులు జారీ చేసింది. దాసరి నారాయణరావు కుమారులు(dasari narayana rao sons) దాసరి ప్రభు, దాసరి అరుణ్‌లు వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్‌ నిర్మాణం కోసం రూ.2కోట్ల 11లక్షల తీసుకున్నారని సోమశేఖర్‌రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తిరిగి డబ్బులు చెల్లించంలో వీరిద్దరూ జాప్యం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

dasari narayana rao sons, notices to dasari narayana rao home
దాసరి ఇంటికి నోటీసులు

ఈ పిటిషన్​ను విచారణలోకి తీసుకున్న కోర్టు... దాసరి ప్రభు, దాసరి అరుణ్​లకు ఆర్డర్ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబర్ 46 సీబీఐ కాలనీలోని ఆయన ఇంటికి వచ్చిన కోర్టు సిబ్బంది... నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఈ నెల 15న అనగా రెండు వారాల గడువులోగా ఆ డబ్బును చెల్లించాలని ఆ నోటీసులో ఆదేశించింది.

ఇదీ చదవండి: Naga shaurya farm house case: 'పేకాడదాం రండి'.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన కార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.