రాజ్భవన్లో కరోనా కలకలం మొదలైంది. 28 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారితో పాటు రాజ్భవన్లో పనిచేసే పది మంది సిబ్బందికి.. వారి కుటుంబీకుల్లో మరో పది మందికి వైరస్ సోకింది. మొత్తంగా 48మంది మహమ్మారిబారిన పడ్డారు.
మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారిలో 347 మందికి నెగెటివ్ వచ్చింది. పోలీసులు, సిబ్బందికి వైరస్ సోకడంతో గవర్నర్ అప్రమత్తం అయ్యారు. గవర్నర్ సహా పలువురు సీనియర్ అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. తనకు నెగిటివ్ వచ్చినట్లు గవర్నర్ తమిళిసై ట్విట్టర్లో వెల్లడించారు. రెడ్జోన్లలో కాంటాక్ట్ హిస్టరీ ఉన్న వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ సూచించారు.