ETV Bharat / state

సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌.. నేడు ఆర్టీపీసీఆర్ ఫలితాలు..!

author img

By

Published : Apr 29, 2021, 5:13 AM IST

సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో కొవిడ్ నెగెటివ్​గా నిర్ధరణ అయింది. ఆర్టీపీసీఆర్ ఫలితాలు నేడు రానున్నాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వెంటనే రాష్ట్రంలో చేపట్టిన ఉచిత టీకాల కార్యక్రమంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌
సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నుంచి కోలుకున్నారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యబృందం బుధవారం ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా వ్యాధి తగ్గినట్లు(నెగెటివ్‌) నిర్ధారణ అయింది. దీంతో పాటు ఆయనకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు సైతం నిర్వహించారు. దీని ఫలితాలు నేడు రానున్నాయి. దానిలో నెగెటివ్‌ నిర్ధారణ అయితే శుక్రవారం నుంచి ఆయన విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది.

ఈ నెల 14న సీఎం కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయన ఎర్రవల్లిలో వైద్య బృందం పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈ నెల 21న ఆయనకు యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలు తగ్గినట్లు తేలింది. ఆ తర్వాత కరోనా చికిత్స ప్రొటోకాల్‌ మేరకు 14 రోజుల గడువు ముగియడంతో బుధవారం మరోసారి యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌లో నెగెటివ్‌ వచ్చినా.. తుది నిర్ధారణకు ఆర్టీపీసీఆర్‌ ప్రామాణికంగా ఉన్నందున దానిలో నెగెటివ్‌ నివేదిక వచ్చాక సీఎం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఉచిత టీకాలపై సమీక్ష
సీఎం కరోనా నుంచి కోలుకున్న వెంటనే రాష్ట్రంలో చేపట్టిన ఉచిత టీకాల కార్యక్రమంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని వారందరికీ ఉచిత టీకాను ఇస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. వచ్చే నెల మొదటి తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని నిర్వహణ ఇతర అంశాలపై సీఎం సమీక్షలో చర్చిస్తారు.

వైరస్‌ను జయిస్తానని చెప్పి సాధించారు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనకు జ్వరం ఇతర అనారోగ్యం లక్షణాలు ఏమాత్రం లేవని ఆయన వ్యక్తిగత వైద్యులు ఎంవీరావు తెలిపారు. గురువారం ఆర్టీపీసీఆర్‌ నివేదికలోనూ ఆయనకు నెగెటివ్‌ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కరోనా నిర్ధారణ అయినప్పటికీ సీఎం ఎంతో ధైర్యంగా ఉన్నారని, వైరస్‌ను జయిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఆయన దానిని నిరూపించారని పేర్కొన్నారు. వయస్సు రీత్యా ఆసుపత్రిలో చేరాలని వైద్యబృందం సూచించినా ఆయన దానికి నిరాకరించారని, హోంఐసొలేషన్‌లో ఉంటూ తమ సలహాలను పాటించారని తెలిపారు. కరోనా వచ్చినా ఆయన పాలనాంశాలపై దృష్టి సారించారని, ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేశారన్నారు. సీఎంకు ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్‌ వచ్చాక ఆయన యథాతథంగా విధుల్లో పాల్గొనవచ్చని చెప్పారు.

హోం ఐసొలేషన్‌లోనే కేటీఆర్‌..ఆసుపత్రిలో చేరిన సంతోష్‌

రోనా బారిన పడిన పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. మరోవైపు కొవిడ్‌ సోకిన తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ జ్వరం, ఇతర లక్షణాలతో బుధవారం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం చికిత్సనందిస్తోంది. ఈ నెల 21న ఆయనకు కరోనా సోకింది. గత వారం రోజులుగా హోం ఐసొలేషన్‌లో ఉన్న ఆయనకు బుధవారం జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు.

ఇదీ చూడండి: 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు అప్పుడే కాదు: డీహెచ్‌ శ్రీనివాస్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నుంచి కోలుకున్నారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యబృందం బుధవారం ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా వ్యాధి తగ్గినట్లు(నెగెటివ్‌) నిర్ధారణ అయింది. దీంతో పాటు ఆయనకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు సైతం నిర్వహించారు. దీని ఫలితాలు నేడు రానున్నాయి. దానిలో నెగెటివ్‌ నిర్ధారణ అయితే శుక్రవారం నుంచి ఆయన విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది.

ఈ నెల 14న సీఎం కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయన ఎర్రవల్లిలో వైద్య బృందం పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈ నెల 21న ఆయనకు యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలు తగ్గినట్లు తేలింది. ఆ తర్వాత కరోనా చికిత్స ప్రొటోకాల్‌ మేరకు 14 రోజుల గడువు ముగియడంతో బుధవారం మరోసారి యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌లో నెగెటివ్‌ వచ్చినా.. తుది నిర్ధారణకు ఆర్టీపీసీఆర్‌ ప్రామాణికంగా ఉన్నందున దానిలో నెగెటివ్‌ నివేదిక వచ్చాక సీఎం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఉచిత టీకాలపై సమీక్ష
సీఎం కరోనా నుంచి కోలుకున్న వెంటనే రాష్ట్రంలో చేపట్టిన ఉచిత టీకాల కార్యక్రమంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని వారందరికీ ఉచిత టీకాను ఇస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. వచ్చే నెల మొదటి తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని నిర్వహణ ఇతర అంశాలపై సీఎం సమీక్షలో చర్చిస్తారు.

వైరస్‌ను జయిస్తానని చెప్పి సాధించారు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనకు జ్వరం ఇతర అనారోగ్యం లక్షణాలు ఏమాత్రం లేవని ఆయన వ్యక్తిగత వైద్యులు ఎంవీరావు తెలిపారు. గురువారం ఆర్టీపీసీఆర్‌ నివేదికలోనూ ఆయనకు నెగెటివ్‌ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కరోనా నిర్ధారణ అయినప్పటికీ సీఎం ఎంతో ధైర్యంగా ఉన్నారని, వైరస్‌ను జయిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఆయన దానిని నిరూపించారని పేర్కొన్నారు. వయస్సు రీత్యా ఆసుపత్రిలో చేరాలని వైద్యబృందం సూచించినా ఆయన దానికి నిరాకరించారని, హోంఐసొలేషన్‌లో ఉంటూ తమ సలహాలను పాటించారని తెలిపారు. కరోనా వచ్చినా ఆయన పాలనాంశాలపై దృష్టి సారించారని, ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేశారన్నారు. సీఎంకు ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్‌ వచ్చాక ఆయన యథాతథంగా విధుల్లో పాల్గొనవచ్చని చెప్పారు.

హోం ఐసొలేషన్‌లోనే కేటీఆర్‌..ఆసుపత్రిలో చేరిన సంతోష్‌

రోనా బారిన పడిన పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. మరోవైపు కొవిడ్‌ సోకిన తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ జ్వరం, ఇతర లక్షణాలతో బుధవారం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం చికిత్సనందిస్తోంది. ఈ నెల 21న ఆయనకు కరోనా సోకింది. గత వారం రోజులుగా హోం ఐసొలేషన్‌లో ఉన్న ఆయనకు బుధవారం జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు.

ఇదీ చూడండి: 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు అప్పుడే కాదు: డీహెచ్‌ శ్రీనివాస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.