ETV Bharat / state

ఏపీలో 303కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

author img

By

Published : Apr 7, 2020, 10:45 AM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేసిన పరీక్షల్లో... కొత్తగా 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి కేసుల సంఖ్య 303కు చేరింది.

corona cases raises to 303 in ap
రాష్ట్రంలో 303కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కు చేరింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 18, నెల్లూరులో 8 పాజిటివ్​గా తేలినట్లు ప్రభుత్వం హెల్త్ బులెటిన్​ విడుదల చేసింది. వైరస్ బారిన పడి కోలుకున్న ఓ వ్యక్తి సోమవారం డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం ఆరుగురికి వ్యాధి నయమై ఇంటికి చేరినట్టు ప్రభుత్వం తెలిపింది.

జిల్లాపాజిటివ్ కేసుల సంఖ్య
నెల్లూరు42
కృష్ణా29
గుంటూరు32
కడప27
ప్రకాశం24
పశ్చిమ గోదావరి21
విశాఖపట్నం20
తూర్పు గోదావరి11
చిత్తూరు17
అనంతపురం06
కర్నూలు74
మొత్తం కేసుల సంఖ్య303

ఇద్దరి మృతిపై అధికారిక ప్రకటన

రాష్ట్రంలో కరోనా వైరస్ సోకడం వల్ల శనివారం ఇద్దరు మరణించగా ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఒకరు, కృష్ణా జిల్లా మచీలిపట్నానికి చెందిన మరొకరు శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారిద్దరికీ పాజిటివ్​ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అంతకు కొన్ని రోజుల ముందు విజయవాడలో ఒక వ్యక్తి మరణించారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెబ్​సైట్​లోనూ ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్యను మూడుగా పేర్కొన్నారు.

corona cases raises to 303 in ap
రాష్ట్రంలో 303కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

ఇవీ చూడండి: 'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కు చేరింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 18, నెల్లూరులో 8 పాజిటివ్​గా తేలినట్లు ప్రభుత్వం హెల్త్ బులెటిన్​ విడుదల చేసింది. వైరస్ బారిన పడి కోలుకున్న ఓ వ్యక్తి సోమవారం డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం ఆరుగురికి వ్యాధి నయమై ఇంటికి చేరినట్టు ప్రభుత్వం తెలిపింది.

జిల్లాపాజిటివ్ కేసుల సంఖ్య
నెల్లూరు42
కృష్ణా29
గుంటూరు32
కడప27
ప్రకాశం24
పశ్చిమ గోదావరి21
విశాఖపట్నం20
తూర్పు గోదావరి11
చిత్తూరు17
అనంతపురం06
కర్నూలు74
మొత్తం కేసుల సంఖ్య303

ఇద్దరి మృతిపై అధికారిక ప్రకటన

రాష్ట్రంలో కరోనా వైరస్ సోకడం వల్ల శనివారం ఇద్దరు మరణించగా ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఒకరు, కృష్ణా జిల్లా మచీలిపట్నానికి చెందిన మరొకరు శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారిద్దరికీ పాజిటివ్​ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అంతకు కొన్ని రోజుల ముందు విజయవాడలో ఒక వ్యక్తి మరణించారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెబ్​సైట్​లోనూ ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్యను మూడుగా పేర్కొన్నారు.

corona cases raises to 303 in ap
రాష్ట్రంలో 303కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

ఇవీ చూడండి: 'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.