రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం (16వ తేదీన) కొత్తగా 894 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 92,255కి చేరింది. వైద్యారోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఆదివారం ఒక్కరోజే కరోనాతో మరో 10 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 703కి చేరింది. తాజాగా 2,006మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 70,132కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆదివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 147 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 85, కరీంనగర్ జిల్లాలో 69, పెద్దపల్లి జిల్లాలో 62, సిద్దిపేట జిల్లాలో 58, మేడ్చల్ జిల్లాలో 51 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : వరుణాగ్రహం: భద్రాద్రిలో 59 అడుగులకు చేరిన నీటిమట్టం