ETV Bharat / state

ముషీరాబాద్​లో విస్తరిస్తోన్న కరోనా.. కొత్తగా 33 పాజిటివ్​ కేసులు

author img

By

Published : Jul 11, 2020, 8:16 PM IST

నగరంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు వైద్య సిబ్బంది విస్తృతంగా కరోనా రాపిడ్​ టెస్టులు చేస్తున్నారు. ఇవాళ కొత్తగా 33 పాజిటివ్​ కేసులు నమోదు కాగా వైరస్​ బారిన పడిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.

corona cases at musheerabad in hyderabad
ముషీరాబాద్​లో విస్తరిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 33 కేసులు

ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది కరోనా రాపిడ్ పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ముషీరాబాద్​లో గత మూడు రోజుల నుంచి 65 మందికి టెస్టులు చేయగా వారిలో 20 మందికి వైరస్​ పాజిటివ్​ నిర్ధరణ అయ్యిందని డీబీఆర్ మిల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులు వెల్లడించారు.

కాగా రాంనగర్, ముషీరాబాద్, భోలక్​పూర్, అడిక్​మెట్, గాంధీనగర్, కవాడిగూడ డివిజన్లలోని అనేక ప్రాంతాల్లో వైద్య అధికారులు పరీక్షలు చేపడుతున్నారు. ఈ ఒక్కరోజులోనే నియోజకవర్గంలో మూడు కరోనా మరణాలు సంభవించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది.

వైద్య సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ నడుమ నియోజకవర్గంలోని మూడు కంటైన్మెంట్​​ జోన్ల పరిధిలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది రసాయన ద్రవాన్ని పిచికారీ చేస్తున్నారు. వైరస్ వ్యాపించిన నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గంలో 730 మంది కరోనా​ బారిన పడ్డారు. కాగా వీరిలో 532 మంది బాధితులు నగరంలోని వేర్వేరు ఆసుపత్రులతో పాటు ఇళ్లల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది కరోనా రాపిడ్ పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ముషీరాబాద్​లో గత మూడు రోజుల నుంచి 65 మందికి టెస్టులు చేయగా వారిలో 20 మందికి వైరస్​ పాజిటివ్​ నిర్ధరణ అయ్యిందని డీబీఆర్ మిల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులు వెల్లడించారు.

కాగా రాంనగర్, ముషీరాబాద్, భోలక్​పూర్, అడిక్​మెట్, గాంధీనగర్, కవాడిగూడ డివిజన్లలోని అనేక ప్రాంతాల్లో వైద్య అధికారులు పరీక్షలు చేపడుతున్నారు. ఈ ఒక్కరోజులోనే నియోజకవర్గంలో మూడు కరోనా మరణాలు సంభవించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది.

వైద్య సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ నడుమ నియోజకవర్గంలోని మూడు కంటైన్మెంట్​​ జోన్ల పరిధిలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది రసాయన ద్రవాన్ని పిచికారీ చేస్తున్నారు. వైరస్ వ్యాపించిన నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గంలో 730 మంది కరోనా​ బారిన పడ్డారు. కాగా వీరిలో 532 మంది బాధితులు నగరంలోని వేర్వేరు ఆసుపత్రులతో పాటు ఇళ్లల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.