ETV Bharat / state

Congress Screening Committee to Meet on 20th September : ఈ నెల 20న కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ సమావేశం.. అప్పుడే అభ్యర్థుల జాబితా

Congress Screening Committee to Meet on 20th September : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఈనెల 20న మరోసారి స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం కానుంది. స్క్రీనింగ్‌ కమిటీ నివేదిక ఆధారంగా కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ యాభైకి పైగా నియోజక వర్గాలకు అభ్యర్ధులను మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 35 నియోజకవర్గాల్లో ఒకే పేరుతో.. 40 నియోజవర్గాల్లో రెండు పేర్లతో మిగిలిన చోట్ల మూడు, నాలుగు పేర్లతో అభ్యర్థుల జాబితాను ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ.. స్క్రీనింగ్‌ కమిటీకి నివేదించినట్లు సమాచారం.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 10:44 PM IST

Telangana Congress
Congress Screening Committee to Meet on 20th September
Congress Screening Committee to Meet on 20th September ఈ నెల 20న కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ సమావేశం.. అప్పుడే అభ్యర్థుల జాబితా

Congress Screening Committee to Meet on 20th September : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ల కోసం దరఖాస్తులు చేసిన 1006 మంది ఆశావహులను వడపోత పోసిన పీసీసీ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(PCC Pradesh Election Committee).. 200 నుంచి 300 వరకు పేర్లతో కూడిన జాబితాను స్క్రీనింగ్‌ కమిటీ(Screening committee)కి నివేదించింది. 29 మంది సభ్యులు వడపోతలో పాల్గొని.. 550 పేజీల జాబితా పుస్తకంలో నియోజకవర్గాల వారీగా బలమైన నేతలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఆ వివరాలు బయటకిరాకుండా అప్పటికప్పుడు సీజ్‌ చేసి.. ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి రోహిత్‌చౌదరి ఆధీనంలో ఉంచుకున్నారు. ఈనెల 6న తాజ్‌కృష్ణలో జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో.. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ నివేదించిన జాబితా అందించినా.. కేవలం విధివిధానాలపై మాత్రమే చర్చించారు. మరోసారి సమావేశమై నియోజకవర్గాల వారీగా వచ్చిన పేర్లను పరిశీలించి బలమైన అభ్యర్థులతో స్క్రీనింగ్‌ కమిటీ ఓ జాబితా సిద్ధం చేసి సీఈసీకి నివేదించనుంది.

Congress Vijayabheri Sabha Arrangements : చరిత్రలో నిలిచేలా కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ..!

Telangana Assembly Election Congress Plan : 35కుపైగా నియోజకవర్గాల్లో.. ఒకే పేరు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. మరో 40చోట్ల రెండు పేర్లతో పీఈసీ(PEC) సభ్యులు.. ప్రతిపాదించినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మూడు పేర్లతో ప్రతిపాదనలు ఉండగా.. నాలుగు పేర్లతో ప్రతిపాదనలు చాలా తక్కువగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. తొలుత ఈనెల18 లేదా 19న సమావేశం నిర్వహించాలని స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఐతే ఆ రెండు తేదీలు సాధ్యం కాదని అంచనా వేసుకున్న కమిటీ.. ఈ నెల 20న సమావేశం కావాలని నిర్ణయించింది. ఆ సమావేశం తర్వాత కొన్నింటిని ఎంపిక చేసి కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తారు. యాభైకిపైగా నియోజక వర్గాలకు కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ తొలి జాబితాలోనే అభ్యర్ధుల్ని ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇబ్బందికరంగా మారిన కొన్ని స్థానాలు : రెండు, మూడు పేర్లు సూచించిన కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధి ఎంపిక స్క్రీనింగ్‌ కమిటీకి కత్తిమీద సాములా కానుంది. జనగాం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారిలో ఒకరిని ఎంపిక చేయడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఒకరు బీసీ కావడం, మరొకరు డీసీసీ అధ్యక్షుడు, ఓసీ సామాజిక వర్గం కావడం.. కమిటీ సున్నితమైనదిగా భావించే అవకాశం ఉంది. వరంగల్‌ పశ్చిమ నుంచి డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రనాథ్‌ రెడ్డి, జంగా రాఘవ రెడ్డి పోటీ పడుతున్నారు. వారిలో రేవంత్‌రెడ్డి మద్దతు రాజేంద్రనాథ్‌రెడ్డికి ఉండగా, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు జంగా రాఘవ రెడ్డికి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం ఇబ్బందికరంగా పరిణమిస్తుందని అంచనా వేస్తున్నారు.

Telangana Congress Selecting MLA Candidates First List : కొల్లాపూర్‌లో ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న జగదీశ్వరరావు, భారత్‌ జోడో యాత్రి కేతూరి వెంకటేశ్‌.. ముగ్గురూ టికెట్‌ ఆశిస్తున్నారు. వారిలో ఒక్కరి ఎంపిక కోసం లోతైన కసరత్తు చేయాల్సి ఉంది. అలా స్క్రీనింగ్‌ కమిటీకి కత్తిమీద సాములా మారే నియోజక వర్గాల విషయంలో నాయకుల రాజకీయ చరిత్ర, సర్వేల్ని ఆధారం చేసుకుని ఇలాంటి సున్నితమైన అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి.

Telangana Congress MLA Candidates First List : నెలాఖరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే​ అభ్యర్థుల తొలి జాబితా!

Congress PEC Meeting at Gandhi Bhavan : అతి త్వరలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా.. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట: రేవంత్​రెడ్డి

Congress Screening Committee to Meet on 20th September ఈ నెల 20న కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ సమావేశం.. అప్పుడే అభ్యర్థుల జాబితా

Congress Screening Committee to Meet on 20th September : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ల కోసం దరఖాస్తులు చేసిన 1006 మంది ఆశావహులను వడపోత పోసిన పీసీసీ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(PCC Pradesh Election Committee).. 200 నుంచి 300 వరకు పేర్లతో కూడిన జాబితాను స్క్రీనింగ్‌ కమిటీ(Screening committee)కి నివేదించింది. 29 మంది సభ్యులు వడపోతలో పాల్గొని.. 550 పేజీల జాబితా పుస్తకంలో నియోజకవర్గాల వారీగా బలమైన నేతలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఆ వివరాలు బయటకిరాకుండా అప్పటికప్పుడు సీజ్‌ చేసి.. ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి రోహిత్‌చౌదరి ఆధీనంలో ఉంచుకున్నారు. ఈనెల 6న తాజ్‌కృష్ణలో జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో.. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ నివేదించిన జాబితా అందించినా.. కేవలం విధివిధానాలపై మాత్రమే చర్చించారు. మరోసారి సమావేశమై నియోజకవర్గాల వారీగా వచ్చిన పేర్లను పరిశీలించి బలమైన అభ్యర్థులతో స్క్రీనింగ్‌ కమిటీ ఓ జాబితా సిద్ధం చేసి సీఈసీకి నివేదించనుంది.

Congress Vijayabheri Sabha Arrangements : చరిత్రలో నిలిచేలా కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ..!

Telangana Assembly Election Congress Plan : 35కుపైగా నియోజకవర్గాల్లో.. ఒకే పేరు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. మరో 40చోట్ల రెండు పేర్లతో పీఈసీ(PEC) సభ్యులు.. ప్రతిపాదించినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మూడు పేర్లతో ప్రతిపాదనలు ఉండగా.. నాలుగు పేర్లతో ప్రతిపాదనలు చాలా తక్కువగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. తొలుత ఈనెల18 లేదా 19న సమావేశం నిర్వహించాలని స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఐతే ఆ రెండు తేదీలు సాధ్యం కాదని అంచనా వేసుకున్న కమిటీ.. ఈ నెల 20న సమావేశం కావాలని నిర్ణయించింది. ఆ సమావేశం తర్వాత కొన్నింటిని ఎంపిక చేసి కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తారు. యాభైకిపైగా నియోజక వర్గాలకు కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ తొలి జాబితాలోనే అభ్యర్ధుల్ని ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇబ్బందికరంగా మారిన కొన్ని స్థానాలు : రెండు, మూడు పేర్లు సూచించిన కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధి ఎంపిక స్క్రీనింగ్‌ కమిటీకి కత్తిమీద సాములా కానుంది. జనగాం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారిలో ఒకరిని ఎంపిక చేయడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఒకరు బీసీ కావడం, మరొకరు డీసీసీ అధ్యక్షుడు, ఓసీ సామాజిక వర్గం కావడం.. కమిటీ సున్నితమైనదిగా భావించే అవకాశం ఉంది. వరంగల్‌ పశ్చిమ నుంచి డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రనాథ్‌ రెడ్డి, జంగా రాఘవ రెడ్డి పోటీ పడుతున్నారు. వారిలో రేవంత్‌రెడ్డి మద్దతు రాజేంద్రనాథ్‌రెడ్డికి ఉండగా, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు జంగా రాఘవ రెడ్డికి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం ఇబ్బందికరంగా పరిణమిస్తుందని అంచనా వేస్తున్నారు.

Telangana Congress Selecting MLA Candidates First List : కొల్లాపూర్‌లో ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న జగదీశ్వరరావు, భారత్‌ జోడో యాత్రి కేతూరి వెంకటేశ్‌.. ముగ్గురూ టికెట్‌ ఆశిస్తున్నారు. వారిలో ఒక్కరి ఎంపిక కోసం లోతైన కసరత్తు చేయాల్సి ఉంది. అలా స్క్రీనింగ్‌ కమిటీకి కత్తిమీద సాములా మారే నియోజక వర్గాల విషయంలో నాయకుల రాజకీయ చరిత్ర, సర్వేల్ని ఆధారం చేసుకుని ఇలాంటి సున్నితమైన అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి.

Telangana Congress MLA Candidates First List : నెలాఖరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే​ అభ్యర్థుల తొలి జాబితా!

Congress PEC Meeting at Gandhi Bhavan : అతి త్వరలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా.. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట: రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.