ETV Bharat / state

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రచారం- పూర్తి స్థాయిలో రంగంలోకి జాతీయ నాయకులు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 9:05 AM IST

Congress Election Campaign in Telangana : నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ప్రచారంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా.. ఈ నెల 15 తర్వాత పార్టీ అగ్ర నేతలు ప్రచారంలో విస్తృతంగా పాల్గొననున్నారు. రాహుల్ , ప్రియాంక, సోనియా గాంధీతో పాటు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారం చేయనున్నారు. బీఆర్ఎస్​, బీజేపీ వైఖరిని ఎండగడుతూ.. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.

Revanth Reddy Comments BRS Leaders
Congress National Leaders Campaign Telangana
Telangana Congress Election Campaign అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రచారం రంగంలోకి జాతీయ నాయకులు

Congress Election Campaign in Telangana : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని.. మరింత వేగంవంతం చేయాలని నిర్ణయించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాల్లో.. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలతో పాటు అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రెండుమూడు రోజుల్లో తెలంగాణ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో ప్రచారం.. తుది దశకు చేరుకోనుంది.

దీంతో ఈ నెల 15 తర్వాత.. తెలంగాణపై ఏఐసీసీ పూర్తిస్థాయిలో దృష్టి సారించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం(Election Campaign in Telangana).. నేతల మధ్య అంతరాలు వంటి అంశాలపై ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులతో సమీక్షించారు.

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - బీసీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయింపు

Revanth Reddy Election Campaign in Telangana : తెలంగాణలో ఎన్నికల వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని.. నేతలంతా ఐక్యంగా పనిచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తైతే ఇకపై జరిగేది అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రచారాన్ని మరింత సమర్థంగా నిర్వహించేలా ముందుకెళ్లాలని సూచించారు. ఈనెల 7 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం(Revanth Reddy Election Campaign 2023) చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే బీఆర్​ఎస్​ వైఖరిని ఎండగడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులను లక్ష్యంగా.. రేవంత్​రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

"కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది. రాష్ట్రంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2014 నుంచి 2018 వరకు హరీశ్​రావు ఉన్నారు. 2018 నుంచి నేటి వరకు కేసీఆర్​ ఉన్నారు. సాగునీటి ప్రాజెక్ట్​ల్లో జరిగిన ప్రతి అవినీతికి సీఎం కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి. మేడిగడ్డపైన ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకు 100 సీట్లలలో డిపాజిట్లు రావు. మరి బీసీ వ్యక్తి ఎలా ముఖ్యమంత్రి అవుతారో ఒకసారి ఆలోచించాలి."- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

'ఈవీఎంలు మార్చి గత ఎన్నికల్లో ధర్మపురిలో బీఆర్‌ఎస్‌ గెలిచింది'

Revanth Reddy Comments on BJP : బీజేపీ తీరుపైన రేవంత్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీల, చేయూత పెన్షన్‌, డిక్లరేషన్లు వంటి అంశాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. ఈనెల 15 తర్వాత అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ.. హైదరాబాద్‌లోనే ఉంటూ లోటుపాట్లు సవరించుకొని ముందుకెళ్లనున్నారు. పార్టీనాయకులు, ఏఐసీసీ పరిశీలకులతో సమావేశం(AICC Meeting) నిర్వహించి ప్రచారంలో వెనుకంజలో ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం

'ఇసుక మీద బ్యారేజీ కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయింది'

Telangana Congress Election Campaign అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రచారం రంగంలోకి జాతీయ నాయకులు

Congress Election Campaign in Telangana : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని.. మరింత వేగంవంతం చేయాలని నిర్ణయించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాల్లో.. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలతో పాటు అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రెండుమూడు రోజుల్లో తెలంగాణ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో ప్రచారం.. తుది దశకు చేరుకోనుంది.

దీంతో ఈ నెల 15 తర్వాత.. తెలంగాణపై ఏఐసీసీ పూర్తిస్థాయిలో దృష్టి సారించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం(Election Campaign in Telangana).. నేతల మధ్య అంతరాలు వంటి అంశాలపై ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులతో సమీక్షించారు.

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - బీసీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయింపు

Revanth Reddy Election Campaign in Telangana : తెలంగాణలో ఎన్నికల వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని.. నేతలంతా ఐక్యంగా పనిచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తైతే ఇకపై జరిగేది అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రచారాన్ని మరింత సమర్థంగా నిర్వహించేలా ముందుకెళ్లాలని సూచించారు. ఈనెల 7 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం(Revanth Reddy Election Campaign 2023) చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే బీఆర్​ఎస్​ వైఖరిని ఎండగడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులను లక్ష్యంగా.. రేవంత్​రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

"కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది. రాష్ట్రంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2014 నుంచి 2018 వరకు హరీశ్​రావు ఉన్నారు. 2018 నుంచి నేటి వరకు కేసీఆర్​ ఉన్నారు. సాగునీటి ప్రాజెక్ట్​ల్లో జరిగిన ప్రతి అవినీతికి సీఎం కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి. మేడిగడ్డపైన ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకు 100 సీట్లలలో డిపాజిట్లు రావు. మరి బీసీ వ్యక్తి ఎలా ముఖ్యమంత్రి అవుతారో ఒకసారి ఆలోచించాలి."- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

'ఈవీఎంలు మార్చి గత ఎన్నికల్లో ధర్మపురిలో బీఆర్‌ఎస్‌ గెలిచింది'

Revanth Reddy Comments on BJP : బీజేపీ తీరుపైన రేవంత్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీల, చేయూత పెన్షన్‌, డిక్లరేషన్లు వంటి అంశాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. ఈనెల 15 తర్వాత అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ.. హైదరాబాద్‌లోనే ఉంటూ లోటుపాట్లు సవరించుకొని ముందుకెళ్లనున్నారు. పార్టీనాయకులు, ఏఐసీసీ పరిశీలకులతో సమావేశం(AICC Meeting) నిర్వహించి ప్రచారంలో వెనుకంజలో ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం

'ఇసుక మీద బ్యారేజీ కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.