హైదరాబాద్ మాదాపూర్లో తృటిలో పెనుప్రమాదం తప్పింది. మాదాపుర్ పీఎస్ పరిధిలోని ఖానామెట్ సమీపంలో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు సెల్లార్ గుంతలో పడిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదంలో బస్సు డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బిల్డర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: గ్రానైట్ లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతి