ETV Bharat / state

పారిశ్రామిక రంగంలో మహిళలను మరింత ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Inaugurated Nampally Numaish Exhibition : నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నుమాయిష్​ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం ఎంతో అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్​ అంటేనే నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకువస్తుందని కితాబిచ్చారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 6:43 PM IST

Updated : Jan 1, 2024, 7:41 PM IST

CM Revanth Reddy Inaugurated Nampally Numaish
Nampally Numaish Exhibition
పారిశ్రామిక రంగంలో మహిళలను మరింత ప్రోత్సహిస్తాం సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Inaugurated Nampally Numaish Exhibition : నగరవాసులను అలరించేందుకు నుమాయిష్‌ 2024 వచ్చేసింది. వివిధ రకాల స్టాళ్లతో నగరవాసులకు అందుబాటులో ఉండనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఫిబ్రవరి 15 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

Numaish Exhibition in Hyderabad : నుమాయిష్​లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపార వేత్తలు పాల్గొంటారని రేవంత్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకువస్తోందన్నారు. ఇందులో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. నుమాయిష్(Numaish Exhibition) కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. నగరవాసులతో పాటు అందర్నీ అలరించేందుకు నుమాయిష్‌ సిద్ధమైందని, ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలని విజ్ఞాప్తి చేశారు.

మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

"హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తోంది. నుమాయిష్​లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం ఎంతో అభినందనీయం. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం."- రేవంత్​ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

Numaish Exhibition Details : గత 82 ఏళ్లుగా నుమాయిష్‌ ప్రదర్శన కొనసాగుతోందని, ప్రస్తుతం 83 వ ఏడాదని నిర్వాహకులు తెలిపారు. 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్టాళ్లను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు పాల్గొంటారని అన్నారు. ఇందులో ప్రవేశానికి రూ.40 రుసుము ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా భద్రత చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

Stalls in Numaish Exhibition : స్టాళ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ ఎగ్జిబిషన్‌ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు. ఇందుకోసం అన్ని శాఖల సహకారం అవసరమని నిర్వాహకులు కోరుతున్నారు. అనేక వస్తు ప్రదర్శనలతో పాటు భిన్న రకాల ఆహారం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో మాస్క్‌ ధరించి రావాలని సూచించారు. మరోవైపు వృద్ధుల కోసం 100 వీల్‌ఛైర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో టాాటా టెక్నాలజీస్ నైపుణ్య శిక్షణ- విధి విధానాలపై కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం

Arrangements of Numaish Exhibition : పెద్దలు, చిన్నపిల్లల్ని కూడా ఆకట్టుకునేలా అనేక ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భారీ సంఖ్యలో జనాలు వచ్చే నేపథ్యంలో ప్రత్యేకంగా మెట్రో రైళ్లు, బస్సులు నడిపేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సమాజ సేవకే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు.

స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం - రూ.2 లక్షల చెక్కు అందజేత

'రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు - పాత లబ్ధిదారులందరికీ కొనసాగిస్తాం'

పారిశ్రామిక రంగంలో మహిళలను మరింత ప్రోత్సహిస్తాం సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Inaugurated Nampally Numaish Exhibition : నగరవాసులను అలరించేందుకు నుమాయిష్‌ 2024 వచ్చేసింది. వివిధ రకాల స్టాళ్లతో నగరవాసులకు అందుబాటులో ఉండనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఫిబ్రవరి 15 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

Numaish Exhibition in Hyderabad : నుమాయిష్​లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపార వేత్తలు పాల్గొంటారని రేవంత్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకువస్తోందన్నారు. ఇందులో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. నుమాయిష్(Numaish Exhibition) కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. నగరవాసులతో పాటు అందర్నీ అలరించేందుకు నుమాయిష్‌ సిద్ధమైందని, ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలని విజ్ఞాప్తి చేశారు.

మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

"హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తోంది. నుమాయిష్​లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం ఎంతో అభినందనీయం. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం."- రేవంత్​ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

Numaish Exhibition Details : గత 82 ఏళ్లుగా నుమాయిష్‌ ప్రదర్శన కొనసాగుతోందని, ప్రస్తుతం 83 వ ఏడాదని నిర్వాహకులు తెలిపారు. 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్టాళ్లను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు పాల్గొంటారని అన్నారు. ఇందులో ప్రవేశానికి రూ.40 రుసుము ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా భద్రత చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

Stalls in Numaish Exhibition : స్టాళ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ ఎగ్జిబిషన్‌ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు. ఇందుకోసం అన్ని శాఖల సహకారం అవసరమని నిర్వాహకులు కోరుతున్నారు. అనేక వస్తు ప్రదర్శనలతో పాటు భిన్న రకాల ఆహారం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో మాస్క్‌ ధరించి రావాలని సూచించారు. మరోవైపు వృద్ధుల కోసం 100 వీల్‌ఛైర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో టాాటా టెక్నాలజీస్ నైపుణ్య శిక్షణ- విధి విధానాలపై కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం

Arrangements of Numaish Exhibition : పెద్దలు, చిన్నపిల్లల్ని కూడా ఆకట్టుకునేలా అనేక ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భారీ సంఖ్యలో జనాలు వచ్చే నేపథ్యంలో ప్రత్యేకంగా మెట్రో రైళ్లు, బస్సులు నడిపేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సమాజ సేవకే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు.

స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం - రూ.2 లక్షల చెక్కు అందజేత

'రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు - పాత లబ్ధిదారులందరికీ కొనసాగిస్తాం'

Last Updated : Jan 1, 2024, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.