ETV Bharat / state

'నాతో పాటు మిగతా వారికి కోత కొనసాగుతుంది'

author img

By

Published : Apr 20, 2020, 6:00 AM IST

Updated : Apr 20, 2020, 9:11 AM IST

ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత... కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. పింఛన్‌దారులకు 25 శాతం మాత్రమే కోత విధిస్తున్నట్లు సీఎం తెలిపారు. విద్యుత్‌ ఉద్యోగులకు ఈ నెల నుంచి పూర్తి జీతాలు ఇస్తామని పేర్కొన్నారు.

Cm kcr on employees salary Cuttings
'నాతో పాటు మిగతా వారికి కోత కొనసాగుతుంది'

తనతో పాటు మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్‌ మాసం వేతనాలలో కోత కొనసాగుతుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వైద్య ఆరోగ్య, పురపాలక పారిశుద్ధ్య సిబ్బందికి గతంలో ప్రకటించిన ప్రోత్సాహకం అదే విధంగా ఉంటుందని.. పోలీసు సిబ్బందికి అదనంగా 10 శాతం వేతనాన్ని కానుకగా ఇస్తామని సీఎం తెలిపారు.

విద్యుత్‌ నిర్వహణ సిబ్బంది, కార్మికులకు యథాతథంగా వేతనాలుంటాయని ముఖ్యమంత్రి వివరించారు. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న 34, 512 మంది.. నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారని.. కేసీఆర్ పేర్కొన్నారు.

లాక్​డౌన్‌ వేళ అత్యవసర శాఖలను.. అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సి ఉంటుందని.. వారి సేవలను గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

ఇవీ చూడండి: ఎలాంటి సడలింపుల్లేవ్​.. మే 7 వరకు లాక్‌డౌన్‌: కేసీఆర్​

తనతో పాటు మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్‌ మాసం వేతనాలలో కోత కొనసాగుతుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వైద్య ఆరోగ్య, పురపాలక పారిశుద్ధ్య సిబ్బందికి గతంలో ప్రకటించిన ప్రోత్సాహకం అదే విధంగా ఉంటుందని.. పోలీసు సిబ్బందికి అదనంగా 10 శాతం వేతనాన్ని కానుకగా ఇస్తామని సీఎం తెలిపారు.

విద్యుత్‌ నిర్వహణ సిబ్బంది, కార్మికులకు యథాతథంగా వేతనాలుంటాయని ముఖ్యమంత్రి వివరించారు. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న 34, 512 మంది.. నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారని.. కేసీఆర్ పేర్కొన్నారు.

లాక్​డౌన్‌ వేళ అత్యవసర శాఖలను.. అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సి ఉంటుందని.. వారి సేవలను గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

ఇవీ చూడండి: ఎలాంటి సడలింపుల్లేవ్​.. మే 7 వరకు లాక్‌డౌన్‌: కేసీఆర్​

Last Updated : Apr 20, 2020, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.