ETV Bharat / state

ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయండి: కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

author img

By

Published : Sep 26, 2021, 7:29 PM IST

Updated : Sep 26, 2021, 11:20 PM IST

సీఎం కేసీఆర్‌ భేటీ
సీఎం కేసీఆర్‌ భేటీ

19:28 September 26

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. రాష్ట్రం నుంచి ఉత్పత్తయ్యే ఉప్పుడు బియ్యం కొనుగోలుపై చర్చించారు. బియ్యం కొనుగోలు అసాధ్యమని ఇటీవల రాష్ట్రానికి సమాచారమిచ్చిన కేంద్రం.. బియ్యం నిల్వలు ఇప్పటికే ఉన్నాయని వెల్లడించింది. 

ఉప్పుడు బియ్యం (Uppudu biyyam)పై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. గత యాసంగి సీజను ధాన్యం నుంచి వచ్చే 62 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంలో కనీసం 50 లక్షల మెట్రిక్‌ టన్నులైనా తీసుకోవాలని కేసీఆర్‌ కోరారు. గతంలో పేర్కొన్న 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల కన్నా అదనంగా తీసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.3,500 కోట్ల వరకు భారం పడుతుంది. కేంద్రం అదనంగా తీసుకుంటుందన్న విశ్వాసం ప్రభుత్వానికి ఉన్నా జాప్యం జరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​తో భేటీ అయిన నేపథ్యంలో ఉప్పుడు బియ్యం కొనుగోలుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

అమిత్​షాతో భేటీ..

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. 

ఇదీ చూడండి: Uppudu biyyam : ఉప్పుడు బియ్యం కొనుగోళ్లపై వీడని ఉత్కంఠ

19:28 September 26

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. రాష్ట్రం నుంచి ఉత్పత్తయ్యే ఉప్పుడు బియ్యం కొనుగోలుపై చర్చించారు. బియ్యం కొనుగోలు అసాధ్యమని ఇటీవల రాష్ట్రానికి సమాచారమిచ్చిన కేంద్రం.. బియ్యం నిల్వలు ఇప్పటికే ఉన్నాయని వెల్లడించింది. 

ఉప్పుడు బియ్యం (Uppudu biyyam)పై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. గత యాసంగి సీజను ధాన్యం నుంచి వచ్చే 62 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంలో కనీసం 50 లక్షల మెట్రిక్‌ టన్నులైనా తీసుకోవాలని కేసీఆర్‌ కోరారు. గతంలో పేర్కొన్న 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల కన్నా అదనంగా తీసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.3,500 కోట్ల వరకు భారం పడుతుంది. కేంద్రం అదనంగా తీసుకుంటుందన్న విశ్వాసం ప్రభుత్వానికి ఉన్నా జాప్యం జరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​తో భేటీ అయిన నేపథ్యంలో ఉప్పుడు బియ్యం కొనుగోలుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

అమిత్​షాతో భేటీ..

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. 

ఇదీ చూడండి: Uppudu biyyam : ఉప్పుడు బియ్యం కొనుగోళ్లపై వీడని ఉత్కంఠ

Last Updated : Sep 26, 2021, 11:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.