ETV Bharat / state

తెరాస నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం

తెరాస ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు, పార్టీ సభ్యత్వంపై సూచనలు చేశారు.

author img

By

Published : Jul 17, 2019, 12:57 PM IST

Updated : Jul 17, 2019, 2:44 PM IST

సీఎం కేసీఆర్​

తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఇటీవల శంకుస్థాపన చేసిన పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలపై సూచనలు చేశారు. ఆటంకాలు, నిధుల కొరత ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దసరాలోపు పూర్తి కావాలని ఆదేశించారు. భవనాల నిర్మాణ నమూనాలు నేతలకు అందజేసి... ఒక్కో జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కును అందజేశారు.

నమోదులో లక్ష్యాన్ని చేరాలి...

పార్టీ సభ్యత్వ నమోదు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదుపై దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించారు. అనంతరం గ్రామకమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమర్థులైన వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు.

విమర్శలు తిప్పికొట్టాలి

అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం. నూతన నిర్మాణాల ఆవశ్యకతను వారికి వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఏయే అంశాలపై దృష్టి సారిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ బిల్లులపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సమాయత్తం కావాలని ఆదేశించారు. పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తలకు అవకాశాలుంటాయని భరోసా ఇచ్చారు.

తెరాస నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం

ఇదీ చూడండి : నేడే కేబినెట్ సమావేశం

తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఇటీవల శంకుస్థాపన చేసిన పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలపై సూచనలు చేశారు. ఆటంకాలు, నిధుల కొరత ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దసరాలోపు పూర్తి కావాలని ఆదేశించారు. భవనాల నిర్మాణ నమూనాలు నేతలకు అందజేసి... ఒక్కో జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కును అందజేశారు.

నమోదులో లక్ష్యాన్ని చేరాలి...

పార్టీ సభ్యత్వ నమోదు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదుపై దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించారు. అనంతరం గ్రామకమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమర్థులైన వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు.

విమర్శలు తిప్పికొట్టాలి

అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం. నూతన నిర్మాణాల ఆవశ్యకతను వారికి వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఏయే అంశాలపై దృష్టి సారిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ బిల్లులపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సమాయత్తం కావాలని ఆదేశించారు. పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తలకు అవకాశాలుంటాయని భరోసా ఇచ్చారు.

తెరాస నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం

ఇదీ చూడండి : నేడే కేబినెట్ సమావేశం

Intro:ఒప్పందాల ఉల్లంఘన వల్ల కోళ్ళ పరిశ్రమ రైతుల నష్టాలు

యాంకర్ పార్టు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లో వెలిదండ గ్రామం లో కోళ్ల పరిశ్రమ లు సుమారుగా 25 వరకు ఉన్నాయి రైతులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టాల లో కొనసాగుతున్నారు అయితే ఒప్పందాల కంపెనీలు మాత్రము కోడి పిల్లలను సకాలంలో అందివ్వక పోవడం పోవడం వల్ల నష్టాలలో కొనసాగుతున్నామని రైతులు వాపోతున్నారు

వాయిస్ ఓవర్: మండలంలోని వెలిదండ గ్రామము కోళ్ల పరిశ్రమ నిలయంగా ఉంది రైతులు స్వయం ఉపాధి కొరకు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టాల లో కొనసాగుతున్నారు పదిమందికి పని కల్పించాలనే ఉద్దేశంతోనే వీటిని నిర్మించామని కనీసం పెట్టుబడులు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది మేమే పని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు ఒక షెడ్ నిర్మాణం జరగాలంటే సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు ఒప్పందాల ప్రకారం కంపెనీ వాళ్లు సంవత్సరానికి ఆరు బ్యాచులు ఇస్తామన్నారు కానీ నాలుగు బ్యాచులు మాత్రమే ఇస్తున్నారు వీటివల్ల పెట్టిన పెట్టుబడికి కనీసం వడ్డీ కూడా రావడం లేదని అంటున్నారు ఒక కేజీ మాంసం తయారయ్యేందుకు సుమారు వంద రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ కంపెనీ వాళ్ళు వంద రూపాయల కంటే ఎక్కువ పెట్టడం లేదని చనిపోయిన కోళ్లు కూడా మేమే భరించాల్సి వస్తుందని అంటున్నారు వర్షాకాలం ప్రభావం వల్ల వైరస్ కోళ్లకు ఎక్కువగా సోకుతుంది వీటికి ఇంజక్షన్స్ ఖర్చు కూడా ఎక్కువగా వస్తుంది కమీషన్ మాత్రము కేజీకి నాలుగు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఒక మనిషి సగటున పని కల్పిస్తే 150000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మనిషి ఖర్చు కూడా మిగలని పరిస్థితి ఉంది కరెంటు బిల్లు కూడా అ కి 4000 నుంచి 5000 రూపాయలకు వస్తుంది

బైట్ 1 సైదులు

బైట్ 2 కారంగుల రవి

బైట్3 మట్టయ్య

END: కంపెనీ వాళ్లు కోడిపిల్లను సకాలంలో అందించడం లేదని భారీ పెట్టుబడులు పెట్టినష్టాలలో కొనసాగుతున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాకు లోన్ ల రూపంలో సహాయం అందించి కోళ్ల పరిశ్రమ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు


Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్

సెంటర్ huzurnagar


Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
Last Updated : Jul 17, 2019, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.