ETV Bharat / state

KCR WISHES: జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

author img

By

Published : Aug 27, 2021, 10:49 AM IST

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీజేఐగా అనతి కాలంలోనే అమూల్యమైన తీర్పులిచ్చారంటూ కొనియాడారు. ఎన్వీ రమణ హుందాతనం, అంకితభావం రేపటి తరానికి ఆదర్శమని కితాబిచ్చారు.

CJI Justice NV Ramana
జస్టిస్ ఎన్.వి.రమణ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులిచ్చి భారత న్యాయ చరిత్రలోనే కొత్త ఒరవడికి నాంది పలికారని జస్టిస్​ రమణ సేవలను కొనియాడారు.

జస్టిస్ ఎన్వీ రమణ హుందాతనం, అంకితభావం రేపటి తరానికి ఆదర్శమని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. మరింతకాలం దేశానికి సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

  • ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులనిచ్చి తమదైన ఒరవడిని పరిచయం చేశారన్నారు. వారి హుందాతనం, వృత్తి పట్ల ఉన్న అంకిత భావం రేపటి తరానికి ఆదర్శం కావాలని, మరింత కాలం దేశానికి సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు.

    — Telangana CMO (@TelanganaCMO) August 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జస్టిస్ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరిలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: దేశ 'సర్వోన్నత' పీఠంపై తెలుగుతేజం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులిచ్చి భారత న్యాయ చరిత్రలోనే కొత్త ఒరవడికి నాంది పలికారని జస్టిస్​ రమణ సేవలను కొనియాడారు.

జస్టిస్ ఎన్వీ రమణ హుందాతనం, అంకితభావం రేపటి తరానికి ఆదర్శమని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. మరింతకాలం దేశానికి సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

  • ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులనిచ్చి తమదైన ఒరవడిని పరిచయం చేశారన్నారు. వారి హుందాతనం, వృత్తి పట్ల ఉన్న అంకిత భావం రేపటి తరానికి ఆదర్శం కావాలని, మరింత కాలం దేశానికి సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు.

    — Telangana CMO (@TelanganaCMO) August 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జస్టిస్ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరిలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: దేశ 'సర్వోన్నత' పీఠంపై తెలుగుతేజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.