ETV Bharat / state

"మాది వ్యవసాయ కుటుంబమే... అందుకే అన్ని సంస్కరణలు"

పౌరసరఫరాల శాఖలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆ శాఖ కమిషనర్ అకున్‌ సబర్వాల్ బదిలీ అయ్యారు. పాలనసహా... ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం పంపిణీ, చౌక ధరల దుకాణాల నిర్వహణలో అవినీతి అక్రమాలకు కళ్ళెం వేసి పారదర్శకత తీసుకొచ్చిన ఆయన కేంద్ర పోలీసు సర్వీసుకు వెళ్లనున్నారు.

author img

By

Published : Oct 30, 2019, 9:32 PM IST

'పోలీసు శాఖైనా మాది వ్యవసాయ కుటుంబమే'
'పోలీసు శాఖైనా మాది వ్యవసాయ కుటుంబమే'

రాష్ట్రంలోని పౌరసరఫరాల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి.. పాలనతో అక్రమాలకు అరికట్టడంలో పారదర్శకత చూపి తనదైన ముద్ర వేసుకున్న కమిషనర్​ అకున్​ సబర్వాల్ కేంద్ర పోలీసు సర్వీసుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి, నల్గొండ జిల్లా పూర్వ కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

వినూత్న విధానాల అమలు:

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్... తీసుకొచ్చిన వినూత్న విధానాలు అమలు చేయడంతోపాటు తాను వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మరికొన్ని సంస్కరణలు అమల్లోకి తెచ్చానని అకున్‌ సబర్వాల్ చెప్పారు. తాను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు మార్కెటింగ్ సీజన్లలో ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేశామని తెలిపారు.

కుటుంబ నేపథ్యమే ఇందుకు కారణం:

ఉద్యోగ రీత్యా పోలీసు శాఖైనప్పటికీ పంజాబ్‌లో తమ కుటుంబం, బంధువులు వ్యవసాయం చేస్తున్నారని... ఆ అనుభవం తనకు ఉన్నందు వల్ల రైతుల్లోకి చొచ్చుకుని వెళ్లి సమస్యలు పరిష్కరించగలిగానని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది సహకారంతో మూడు మార్కెట్ సీజన్లు పనిచేయడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు.

ఇదీ చూడండి: కేంద్ర రక్షణ మంత్రితో కేటీఆర్​ భేటీ

'పోలీసు శాఖైనా మాది వ్యవసాయ కుటుంబమే'

రాష్ట్రంలోని పౌరసరఫరాల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి.. పాలనతో అక్రమాలకు అరికట్టడంలో పారదర్శకత చూపి తనదైన ముద్ర వేసుకున్న కమిషనర్​ అకున్​ సబర్వాల్ కేంద్ర పోలీసు సర్వీసుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి, నల్గొండ జిల్లా పూర్వ కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

వినూత్న విధానాల అమలు:

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్... తీసుకొచ్చిన వినూత్న విధానాలు అమలు చేయడంతోపాటు తాను వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మరికొన్ని సంస్కరణలు అమల్లోకి తెచ్చానని అకున్‌ సబర్వాల్ చెప్పారు. తాను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు మార్కెటింగ్ సీజన్లలో ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేశామని తెలిపారు.

కుటుంబ నేపథ్యమే ఇందుకు కారణం:

ఉద్యోగ రీత్యా పోలీసు శాఖైనప్పటికీ పంజాబ్‌లో తమ కుటుంబం, బంధువులు వ్యవసాయం చేస్తున్నారని... ఆ అనుభవం తనకు ఉన్నందు వల్ల రైతుల్లోకి చొచ్చుకుని వెళ్లి సమస్యలు పరిష్కరించగలిగానని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది సహకారంతో మూడు మార్కెట్ సీజన్లు పనిచేయడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు.

ఇదీ చూడండి: కేంద్ర రక్షణ మంత్రితో కేటీఆర్​ భేటీ

30-10-2019 TG_HYD_27_30_CIVIL_SUPPLY_COMMISSIONER_RELIEVE_AB_3038200 REPORTER : MALLIK.B CAM : VENKAT ( ) రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఆ శాఖ కమిషనర్ అకున్‌ సబర్వాల్ విధుల నుంచి నిష్క్రమించారు. పాలనసహా... ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం పంపిణీ, ఛౌక ధరల దుకాణాల నిర్వహణలో అవినీతి అక్రమాలకు కళ్ళెం వేసి పారదర్శకత తీసుకొచ్చిన ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవల అకున్ సబర్వాల్‌... కేంద్ర పోలీసు సర్వీసుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశ్రాంత ఐఎస్‌ఐ అధికారి, నల్గొండ జిల్లా పూర్వ కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పట్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్... తీసుకొచ్చిన వినూత్న విధానాలు అమలు చేయడంతోపాటు తాను వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మరికొన్ని సంస్కరణలు అమల్లోకి తెచ్చామని అకున్‌ సబర్వాల్ చెప్పారు. తాను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు మార్కెటింగ్ సీజన్లలో ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధాన్యం విక్రయించిన 24 గంటలు లేదా మూడు నాలుగు రోజుల్లో సొమ్ము చెల్లించామని స్పష్టం చేశారు. ఉద్యోగ రీత్యా పోలీసు శాఖైనప్పటికీ పంజాబ్‌లో తమ కుటుంబం, బంధువులు వ్యవసాయ చేస్తున్నారని... ఆ అనుభవం కూడా తనకున్నందున రైతుల్లోకి చొచ్చుకుని వెళ్లి సమస్యలు పరిష్కరించగలిగానని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది సహకారంతో మూడు మార్కెట్ సీజన్లు పనిచేయడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. VIS.........BYTE........... అకున్ సబర్వాల్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.