దొంగతనం చేసిన బంగారు గొలుసు అమ్ముతూ హైదరాబాద్ తిరుమలగిరి పోలీసులకు వడ్లూరి విజయలక్ష్మి, సాయికిరణ్ దంపతులు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి ఐదుతులాల పుస్తెలతాడు.. ఒక ద్విచక్రవాహనం, రెండు చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం
సికింద్రాబాద్ పరిధిలోని టీచర్స్కాలనీలో వడ్లూరి సాయికిరణ్ దంపతులు కిరాయికి ఉంటున్నారు. ఈనెల 14వ తేదీన అదే కాలనీలో ఉంటున్న భ్రమరాంబ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి రూమ్ అద్దెకు ఉందా అని విజయలక్ష్మి అడిగింది. ఇక్కడేమీ కిరాయికి లేవని ఆమె సమాధానమిచ్చింది. కొద్దిసేపటికి పక్కా ప్లాన్ ప్రకారం భ్రమరాంభ ఇంటి తలుపు తట్టి ఆమె తలుపుతీయగానే మెడలోని పుస్తెలతాడును బలవంతంగా లాక్కుని బైక్పై వీరు పారిపోయారు. దీనితో ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.
అయితే 22వ తేదీ చిలకలగూడ సమీపంలోని ఓ దుకాణంలో ఆ జంట గొలుసును అమ్ముతుండగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసినందుకు బేగంపేట ఏసీపీ శ్రీ నరేశ్రెడ్డి క్రైమ్ సిబ్బందిని అభినందించారు.
ఇవీ చూడండి: మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్ రాకపోకలపై ఆంక్షలు