ETV Bharat / state

దివ్యాంగులకు ఓటరు అవగాహన కార్యక్రమం

ఎన్నికల్లో ఓటింగ్​ శాతం పెరిగేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అవగాహన కార్యక్రమాలతో ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. నెక్లెస్​ రోడ్డులో దివ్యాంగులకు ఓటు అవగాహన కార్యక్రమాన్ని ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​ ప్రారంభించారు.

author img

By

Published : Mar 31, 2019, 11:28 AM IST

Updated : Mar 31, 2019, 1:45 PM IST

ఓటరు అవగాహన
ఓటరు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులు
హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డులోదివ్యాంగులకు ఓటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'అందరికీ అందుబాటులో ఎన్నికలు' అనే నినాదంతో నడక కార్యక్రమాన్ని ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​ ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్​, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​, మిథాలీరాజ్​, సినీ గేయ రచయిత అనంత శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు ఓటు వినియోగంపై దివ్యాంగులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఎన్నికల్లో దివ్యాంగుల ఓటింగ్​ శాతం పెరుగుతుండటం సంతోషకరమని రజత్​కుమార్​ అన్నారు. ఈసారి 70వేల మంది దివ్యాంగులు అదనంగా ఓటరు జాబితాలో చేరారని స్పష్టం చేశారు. హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో అన్ని పోలీసు స్టేషన్లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని సీపీ అంజనీకుమార్​ అన్నారు. తమకు ఎదురయ్యే సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ అధికారులు, దివ్యాంగులు భారీగా పాల్గొన్నారు. ఈసారి 100 శాతం పోలింగ్​ నమోదు కావాలని అధికారులు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి :'ఇవాళ అర్ధరాత్రి వరకు ఆస్తిపన్ను చెల్లించవచ్చు'

ఓటరు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులు
హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డులోదివ్యాంగులకు ఓటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'అందరికీ అందుబాటులో ఎన్నికలు' అనే నినాదంతో నడక కార్యక్రమాన్ని ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​ ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్​, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​, మిథాలీరాజ్​, సినీ గేయ రచయిత అనంత శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు ఓటు వినియోగంపై దివ్యాంగులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఎన్నికల్లో దివ్యాంగుల ఓటింగ్​ శాతం పెరుగుతుండటం సంతోషకరమని రజత్​కుమార్​ అన్నారు. ఈసారి 70వేల మంది దివ్యాంగులు అదనంగా ఓటరు జాబితాలో చేరారని స్పష్టం చేశారు. హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో అన్ని పోలీసు స్టేషన్లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని సీపీ అంజనీకుమార్​ అన్నారు. తమకు ఎదురయ్యే సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ అధికారులు, దివ్యాంగులు భారీగా పాల్గొన్నారు. ఈసారి 100 శాతం పోలింగ్​ నమోదు కావాలని అధికారులు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి :'ఇవాళ అర్ధరాత్రి వరకు ఆస్తిపన్ను చెల్లించవచ్చు'

Last Updated : Mar 31, 2019, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.