ETV Bharat / state

'జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి' - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​

కుటుంబ సభ్యులందరికీ ఒకే చోట ఓటు ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల పరిశీలనా కార్యక్రమం, జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

సీఈవో రజత్​కుమార్​
author img

By

Published : Sep 9, 2019, 8:15 PM IST

ఓటర్ల పరిశీలనా కార్యక్రమం, జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సూచించారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు తగిన సహకారం అందించాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వెబ్​సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ వివరాలను పరిశీలించుకుని... అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని వివరించారు. గతంలో కుటుంబంలోని వారి ఓట్లు వేర్వేరు చోట్ల ఉండేవని... ఇక నుంచి ఆ ఇబ్బంది లేకుండా ఒకే చోట ఉండేలా వెసులుబాటు ఉంటుందని అన్నారు. జిల్లా స్థాయిల్లోనూ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పురపాలక ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు.

'జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి'

ఇదీ చూడండి : అసెంబ్లీ పనిదినాలు కుదించడం సరికాదు

ఓటర్ల పరిశీలనా కార్యక్రమం, జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సూచించారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు తగిన సహకారం అందించాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వెబ్​సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ వివరాలను పరిశీలించుకుని... అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని వివరించారు. గతంలో కుటుంబంలోని వారి ఓట్లు వేర్వేరు చోట్ల ఉండేవని... ఇక నుంచి ఆ ఇబ్బంది లేకుండా ఒకే చోట ఉండేలా వెసులుబాటు ఉంటుందని అన్నారు. జిల్లా స్థాయిల్లోనూ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పురపాలక ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు.

'జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి'

ఇదీ చూడండి : అసెంబ్లీ పనిదినాలు కుదించడం సరికాదు

Intro:సికింద్రాబాద్ యాంకర్...చిన్న చిన్నగా మొదలై గణనాధుడు ఆశీస్సులతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతున్నామని సికింద్రాబాద్ అంజయ్య నగర్ వాసులు తెలిపారు..సికింద్రాబాదులోని అంజయ్య నగర్ లో ప్రతిష్టాపన చేసిన ఘన నాయకుడిని నేడు నిమజ్జనానికి తరలించారు..రంగురంగుల విద్యుత్ కాంతుల వెలుగులతో పూల అలంకరణలతో గణనాధుని తరలించే వాహనాన్ని అలంకరించారు..ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విద్యుత్ దీపాల వెలుగులో తీన్మార్ చప్పుళ్ళ మధ్య నృత్యాలతో గణనాథుని ఊరేగింపు నిర్వహించారు..ఈ సందర్భంగా అంజయ్య నగర్ వాసులు మాట్లాడుతూ తాము గత ఐదేళ్ల నుండి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ట ఇస్తున్నామని బస్తీ వాసుల సహకారంతో అంచలంచెలుగా ఎదిగి పెద్ద ఎత్తున గణపతి నవరాత్రులను చేపడుతున్నట్లు వారు వెల్లడించారు..గణనాధుని కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వారు కోరుకున్నారు..చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మధ్యన ఉత్సవంలో పాల్గొని ఉత్సాహంగా చిందులేశారు..బైట్ రాజేష్ అంజయ్య నగర్ స్థానికుడు Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.