సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని కేంద్ర బృందం సందర్శించింది. వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఇతర విభాగాల వైద్యాధికారులతో బృంద సభ్యులు సమావేశమయ్యారు. కరోనా పాజిటివ్ కేసులకు అందిస్తున్న వైద్య సేవలు, వసతులు, అందుబాటులో ఉన్న శానిటేషన్, పారామెడికల్ సిబ్బంది వంటి వివరాలు తెలుసుకున్నారు. సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పీపీఈలు, మందుల లభ్యత లాంటి విషయాలపై ఆరా తీశారు. వైద్యశాలలోని బెడ్స్, ఐసీయూలో పడకలు, వెంటిలేటర్లు తదితర అంశాల గురించి వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న కేసులలో 90శాతం మంది ఆరోగ్యస్థితి మామూలుగానే ఉన్నట్లు వైద్యులు... కేంద్ర బృందానికి వివరించారు.
ఇదీ చూడండి: 'కరోనాపై పోరు సాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం'